NLG: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ పాల్గొని పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్ ట్యాంకులను, మురికి కాలువలను శుభ్రపరచారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తన వంతుగా ఎప్పుడా ముందుంటానని పేర్కొన్నారు.