VZM: ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆదేశాలతో టీడీపీ ముఖ్య నాయకులు విజయనగరం 43వ డివిజన్లో కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నూతనంగా నియమించిన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. అలాగే, సోషల్ మీడియాలో కూడా క్రియాశీలకంగా ఉండాలన్నారు.