SDPT: జిల్లా కలెక్టరేట్లో సెన్సస్-2027 ప్రక్రియపై తహశీల్దార్లు, ఎంపీడీవోలకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. జనాభా గణన ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశాభివృద్ధి ప్రణాళికలకు జనగణన కీలకమని, క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.