MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తల గురించి పొందుపరిచిన రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. మార్చి 16 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.