GDWL:వడ్డేపల్లి మండలం పైపాడులో బుధవారం పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రెండో రోజు పశువులకు గాలి కుంటూ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి సూచించారు. టీకాల వల్ల పశువులకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అవి ఆరోగ్యంగా ఉంటాయని ఆమె తెలిపారు.