NLG: దేవరకొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య సహా 400 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీస్ శాఖ కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు ఉండి కూడా సాగర్, ఎస్ఎల్బీసీ కింద నీళ్లివ్వలేదని విమర్శించారు.