జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘వదలా’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా నిర్మించాలంటే భయం వేసిందని, దర్శకుడికి కథపై ఉన్న నమ్మకమే తనను ముందుకు నడిపించిందని తెలిపాడు. ఇండస్ట్రీలో తన మనుగడ కష్టమనుకున్న సమయంలో ఈ సినిమా తీశామని, జగపతి బాబు లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నాడు.