TG: టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణపై ఎంపీ కృష్ణదేవరాయ చేసిన కామెంట్స్పై ఆయన స్పందించారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని.. అభివృద్ధిలో దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. ఏపీ, తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నామని.. తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలని తెలిపారు.