NGKL: అవుసలికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఇమ్యునైజేషన్ టీకాలు వేశారు. అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. కోరింత దగ్గు, ధనుర్వాతం వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడావత్ మంగమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.