• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: కవితకు బిగ్ షాక్

TG: లిక్కర్ స్కామ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ అధికారులు HYD బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన నోటీసులను ఆమెకు జారీ చేసేందుకు వెళ్లారు. ఆమె లేకపోవడంతో సీబీఐ అధికారులు నోటీసులను భర్త అనిల్ కుమార్‌కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారు అనే వివరాలను అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం.

March 12, 2026 / 01:08 PM IST

రేపు కలెక్టరేట్లో కవయిత్రి మోల్లమాంబ జయంతి కార్యక్రమం

VZM: కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి కార్యక్రమంను రేపు ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సదరు కార్యక్రమమునకు అధికారులు, ప్రజాప్రతినిధులు, బి.సి. సంఘ సభ్యులు, ప్రజలు హాజరు కావలసినదిగా కోరారు.

March 12, 2026 / 01:08 PM IST

‘మత్తుకు బానిసై యువత భవిష్యత్తు నాశనం’

BDK: మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కరకగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం గంజాయి నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్ధ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

March 12, 2026 / 01:07 PM IST

గూడూరులో ఈనెల 14న ప్రవేశ పరీక్ష

MHBD: గూడూరు మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్ష ఈనెల 13న నిర్వహించనున్నట్లు MEO రవికుమార్ తెలిపారు. హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 12లోగా https://tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 12, 2026 / 01:05 PM IST

పాత కంబాలపల్లిలో సీతారాముల కళ్యాణం

NLG: చందంపేట మండలం పాత కంబాలపల్లిలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

March 12, 2026 / 01:05 PM IST

షోరూంను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యేలు

HNK: నక్కలగుట్టలో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూంను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం షోరూంలో నిర్వహించిన ఫ్యాషన్-షోను వారు తిలకించి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

March 12, 2026 / 01:05 PM IST

ఈనెల 15న తిరుమలలో తాళ్లపాక వర్థంతి మహోత్సవం

TPT: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని 15న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు.

March 12, 2026 / 01:05 PM IST

వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో

కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్, ఛైర్ పర్సన్, కౌన్సిలర్లకు నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని నేడు DMHO డా.రవీందర్ గౌడ్ సందర్శించారు. వేసవికాలం నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

March 12, 2026 / 01:04 PM IST

ప్రగతి ప్రణాళిక ప్రకటనలకే పరిమితమా

GDWL: ముక్కుపుటలు అదిరే కంపు, అడుగుతీసి అడుగు వేయలేని చెత్తాచెదారం, ఇదేనా మాకు మీరు అందించే ప్రజా పాలన. రోడ్ల నిండా మురుగు నిలిచి నరకం కనిపిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు అని గద్వాల పట్టణంలోని 10, 11, 12 వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళికను ప్రారంభించిన ప్రకటనలకే పరిమితమైందన్నారు.

March 12, 2026 / 01:04 PM IST

‘బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి’

KMM: వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన 700 కుటుంబాల్లో 311 మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన బాధితులకు పట్టాలు ఇవ్వకపోవడం సరైన విధానం కాదని CPI ML న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య ఆరోపించారు. బాధితులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇళ్ల కూల్చివేత వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

March 12, 2026 / 01:03 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

NLG: హైదరాబాద్‌లోని బీ.డీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగిన వింజమూరు గ్రామానికి చెందిన చంద సత్యనారాయణ కుమార్తె లహరిక వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, కేతావత్ బిల్యా నాయక్ పాల్గొన్నారు. వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ దాసు ఉన్నారు.

March 12, 2026 / 01:03 PM IST

ప్రభుత్వ భూమి కబ్జా యత్నంపై సీపీఐ ఆందోళన

KRNL: వెల్దుర్తి పట్టణంలోని సర్వే నంబర్లు 465, 565/Aకు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ సీపీఐ నాయకులు ఇవాళ రీ సర్వే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సీపీఐ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని పలుమార్లు MRO కార్యాలయానికి వినతిపత్రాలు అందజేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.

March 12, 2026 / 01:03 PM IST

నా ధైర్యం.. నా బలం మీరే: వైఎస్ జగన్

AP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘నా ధైర్యం.. నా బలం మీరే.. నాన్న గారి ఆశయ సాధనకు స్థాపించిన వైసీపీని, న‌న్ను గుండెల్లో పెట్టుకున్నారు. మన పార్టీ ప్రస్థానం ఒక రాజకీయ ప్రయాణం కాదు.. ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.

March 12, 2026 / 01:03 PM IST

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కిన్నెర మయూరి -వెంకటేశ్వరరావు దంపతులు ఇందిర్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఇవాళ గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు.

March 12, 2026 / 01:02 PM IST

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఆందోళన

నల్గొండలో నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు.

March 12, 2026 / 01:01 PM IST