• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విజయనగరంలో హిజ్రాలు నిరసన

VZM: అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను ఆమెతో సహవాసం చేసే దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దీపు ఆత్మకు శాంతి కలగాలని నగరంలోని హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోషియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండబాబు, అధ్యక్ష కార్యదర్శులు దవడ మీనాకుమారి, స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం సమర్పించారు.

March 24, 2025 / 07:11 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1.39 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,39,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 227 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.

March 24, 2025 / 06:56 PM IST

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు: ఏఎస్పీ

NRML: రోడ్డు ఆక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా హెచ్చరించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.

March 24, 2025 / 06:54 PM IST

టీడీపీ గూటికి మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు

PPM: పార్వతీపురం వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరోఇద్దరు కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పురపాలక సంఘం 1వ వార్డు, 30వ వార్డులకు చెందిన కౌన్సిలర్లు రణబేరి బంగారు నాయుడు, చిన్నం నాయుడు, వైసీపీ నాయకులు వెంకట్రావు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

March 24, 2025 / 06:39 PM IST

ప్రజల ఆరోగ్యం భద్రతకే అధిక ప్రాధాన్యత: కమిషనర్

KKD: ప్రజల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య సోమవారం తెలిపారు. పట్టణంలోని ఒక చికెన్ సెంటర్లో ప్రజలు కొనుగోలు చేసిన మాంసంలో పురుగుల ఘటనపై ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పట్టణ పరిధిలోని అన్ని షాపులను అధికారులతో తనిఖీలు చేయించి, అక్రమార్కుల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

March 24, 2025 / 06:38 PM IST

‘మద్యం షాపు వద్దు అంటూ’ ఫ్లకార్డులు ప్రదర్శన

కోనసీమ: పుస్తకాలు చేత పట్టి చదువుకోవాల్సిన పిల్లలు ప్లకార్డులు చేత పట్టి ఉద్యమ బాటపడుతున్నారు. సోమవారం మండపేట సప్తగిరి థియేటర్ వద్ధ ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు తక్షణం తొలగించాలని మహిళలు చేస్తున్న ఆందోళనకు మేము సైతం అంటూ.. “మద్యం షాపు మాకు వద్దు” అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

March 24, 2025 / 06:27 PM IST

పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని వినతి

KKD: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఉన్న ప్రభుత్వ పాఠశాల జడ్పీహెచ్ స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనాకు ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరి బాబు మాట్లాడుతూ… గత 20 సంవత్సరాల క్రితం నుంచి పాఠశాలకు ప్రహరీ గోడ లేదన్నారు.

March 24, 2025 / 06:21 PM IST

‘పోలీసులు బాధ్యతగా పనిచేయాలి’

BHPL: భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21 మంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై విచారణ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

March 24, 2025 / 05:59 PM IST

భూగర్భ జలాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

ADB: జలవనరులు, భూవనరుల విభాగం న్యూఢిల్లీ నుంచి నీటి వనరుల పునరుజ్జీవనం అమలుపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NITI ఆయోగ్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చెరువుల్లో పూడికతీతతో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. చెరువుల పరిధిలో ఆయకట్టు సాగుకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

March 24, 2025 / 05:56 PM IST

విద్యార్థులకు షీ టీం చట్టాలపై అవగాహన

ASF: జిల్లా కాగజ్‌నగర్ అరుణోదయ స్కూల్ విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్‌లు వంటి అంశాలపై ఎఎస్ఐ సునీత వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం హెల్ప్ లైన్ 87126 70565 లేదా డయల్ 100 ద్వారా సహాయం కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, టీచర్లు, షీ టీం పాల్గొన్నారు.

March 24, 2025 / 05:51 PM IST

“రైతులకు స్ప్లింకర్లు పంపిణీ చేసిన అధికారులు”

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కల్వరాల గ్రామానికి చెందిన 33 మంది రైతులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమవారం స్ప్లింకర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా హార్టికల్చర్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని సూచించారు.

March 24, 2025 / 05:41 PM IST

రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిన ‘కోర్ట్‌’

హీరో నాని సమర్పణలో రామ్ జగదీష్ తెరకెక్కించిన మూవీ ‘కోర్ట్’. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబడుతోంది. 10 రోజుల్లో ఈ మూవీ రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇదొక హిస్టారిక్ జడ్జిమెంట్ అంటూ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు.

March 24, 2025 / 05:24 PM IST

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన CP

MNCL: రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సోమవారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి, సిబ్బందితో సీపీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు పరిశీలించి వారి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించి, త్వరగా పనులు పూర్తిచేయాలన్నారు.

March 24, 2025 / 05:20 PM IST

ఉద్యమకారుల హామీల అమలుకు డిమాండ్

BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో పలువురు నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 నగదు సహాయాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నేతలు పాల్గొన్నారు.

March 24, 2025 / 05:05 PM IST

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

NRPT: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

March 24, 2025 / 04:58 PM IST