• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ షాప్స్ బంద్

WNP: ఆత్మకూరు, మదనాపురం మండాలాల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృతి చెందాయి. సమాచారం మేరకు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్‌ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉందన్నారు.

February 21, 2025 / 01:01 PM IST

మంటల్లో చిక్కుకొని మహిళ మృతి

SRCL: చెత్త అంటుపెడుతూ ఓ మహిళ మంటల్లో చిక్కుకొని మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్ని అంజవ్వ(52) చెత్తను కాల్చివేస్తుండగా, మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. మృతురాలికి భర్త బాల్ రెడ్డి, ఇద్దరు కూతుళ్ళు భాగ్య, భవానిలు ఉన్నారు.

February 21, 2025 / 12:49 PM IST

ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ మహా దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డిలకు ఇవాళ ఖేడ్‌లో పద్మశాలి సంఘం, కుల పెద్దలు, వైదిక పురోహితులు గురురాజు శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. 3 మంచి ఆరో తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు.

February 21, 2025 / 12:48 PM IST

కొత్త మండలాల కోసం ఎదురుచూపులు

NRPT: జిల్లాలోని 3 గ్రామాల ప్రజలు సీఎం మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటకొండ, గార్లపహాడ్, కానుకుర్తీలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇంఛార్జ్‌ కుంభం శివకుమార్ రెడ్డి ఇటీవల పర్యటనలో సీఎం నోటి వెంట కొత్త మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2025 / 12:44 PM IST

తాగునీటి పైప్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం నాగలాపురం మూడవ సెగ్మెంట్ లోని ఈస్ట్ హరిజనవాడలో రూ.5 లక్షల అంచనాతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వడ్లకుప్పం గ్రామంలో రూ.13.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

February 21, 2025 / 12:41 PM IST

సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన

SRD: కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల కోసం సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, వహిద్ పాషాలు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.

February 21, 2025 / 12:34 PM IST

క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్

JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో బాక్స్ క్రికెట్ చిల్డ్రన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 21, 2025 / 12:29 PM IST

పులివెందుల వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా జశ్వంత్

కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలో వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పులివెందుల పట్టణానికి చెందిన పోరెడ్డి జశ్వంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2025 / 12:29 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమావేశం

JGL: గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జగిత్యాల నియోజకవర్గ బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా గెలిపించాలో చర్చించారు. ఈ సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2025 / 12:27 PM IST

ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నేతలు

MDK: నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని సూచించారు. అంజిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

February 21, 2025 / 12:21 PM IST

యాసంగి పంటలపై రైతులకు అవగాహన

MDK: నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ అధికారులు రైతులకు యాసంగి పంటలపై తగు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. వరి కోత కోసే సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ యొక్క వేగం 18 – 20 ఆర్పీయం ఉంచడం ద్వారా గింజలు రాలడం తగ్గించవచ్చన్నారు. దాన్ని ముందుగానే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. తేమ 17% ఉండేటట్లు చూడాలన్నారు.

February 21, 2025 / 12:19 PM IST

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

MDK: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

February 21, 2025 / 12:16 PM IST

బైకును ఢీకొన్న కంటైనర్.. వ్యక్తి మృతి

నల్గొండ: మిర్యాలగూడెం నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వచ్చి బైకును, నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవరు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.

February 21, 2025 / 11:56 AM IST

‘విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి’

SRPT: కోదాడ మండలంలోని గురుకుల పాఠశాలలను ఇవాళ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన ఎలా పెడుతున్నారు. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాల పరిసరాలను పరిశీలించారు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.

February 21, 2025 / 11:45 AM IST

నేడు భారత్, పాక్‌ మధ్య ఫ్లాగ్‌ మీటింగ్‌

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సరిహద్దులో నియంత్రణ రేఖపై ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాలు ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి.

February 21, 2025 / 11:28 AM IST