MDK: జిల్లాలో సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, చిలిపిచేడ్, మాసాయిపేట మండలాల్లో అకాల వర్షం పడటంతో చాలా చోట్ల ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. యాసంగి వరి కోతల సమయంలో ఇలాంటి వానలు పడడంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు
SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన నర్సమ్మ(55) అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీన సదాశివపేటకు వెళ్లిన నరసమ్మ ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద విచారించగా ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.
కోనసీమ: టీడీపీ సంస్ధాగత ఎన్నికలు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబ సాధికార సారధులను ప్రతీ గ్రామంలోని వార్డులలో ఈనెల 20వ తేదీ లోపు నియమించాలన్నారు.
కోనసీమ: రాజోలు MLA దేవా వరప్రసాద్ శనివారం పర్యటన వివరాలను విశ్వేశ్వరాయపురంలోని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు. మల్కిపురంలోని గొల్లపాలెం గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయన కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. లక్కవరంలో సాయంత్రం 4 గంటలకు కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు.
TPT: రేణిగుంట మండలం గొల్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్ది శెట్టి శంకర్ భార్య లీలావతి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాయకులతో కలిసి శుక్రవారం గొల్లపల్లి చేరుకొని ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాడే మోశారు.
SKLM: జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ కొరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రేపటి కార్యక్రమ ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.
CTR: గ్రీమ్స్ పేటలోని డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించే తెలంగాణ భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ బియం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
SKLM: జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి శ్రీకాకుళం కార్యాలయం నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.
WNP: కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జబ్బార్ డిమాండ్ చేశారు. కొత్తకోటలో ఆవాజ్ సంఘం, ప్రజాసంఘాలు, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ప్రధానిమోడీకి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ ఆస్తులను అన్యక్రాంతం చేసేందుకే సవరణ బిల్లు ప్రవేశపెట్టారన్నారు.
శ్రీకాకుళం: ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. మున్సిపల్, సచివాలయం, మెప్మా సిబ్బంది హాజరుకావాలని సూచించారు.
TG: రాష్ట్రంలో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు NTT డేటా ముందుకు వచ్చింది. టోక్యో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు MOU చేసుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యం గల.. 25 వేల సీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో క్లస్టర్ నిర్మాణం చేపట్టనుంది. తెలంగాణను ఏఐ రాజధానిగా ఈ ప్రాజెక్టు తీర్చిదద్దనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
AP: రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరికి క్విక్ బ్యాక్స్ వెళ్లాయని సిట్ అధికారులు ప్రశ్నించారని మాజీ MP విజయసాయిరెడ్డి చెప్పారు. క్విక్ బ్యాక్స్ విషయం తనకు తెలియదని చెప్పానని తెలిపారు. అరబిందోకి రూ.100 కోట్లు, రూ. 60 కోట్లు అడాన్ కంపెనీకి, మరో రూ. 10 కోట్లు డీకార్ట్ కంపెనీకి అప్పు ఇప్పించానని చెప్పారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరని వెల్లడించారు.
MDK: ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన మెదక్. జిల్లాలో వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, 100 ఏళ్ల సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చరిత్ర పరిశోధకుడు సంతోశ్ ఆవేదన వ్యక్తం చేశారు.నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.
AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ MP విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. లిక్కర్కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా, 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా అని ప్రశ్నించారని చెప్పారు. రెండు మీటింగులు జరిగింది వాస్తవమేనని తెలిపారు. వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు మీటింగుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.