VZM: మాతృ దినోత్సవం సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన మాతృమూర్తి సూరప్పమ్మకు ఆదివారం పాదాభివందనం చేశారు. లావేరు మండలం మెట్టవలసలో విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో తల్లితో కలిసి మొక్కను నాటారు. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో 29వ రోజు తన తల్లితో కలిసి మొక్కను నాటినట్లు ఎంపీ తెలిపారు. తల్లిని ప్రతి ఒక్కరూ పూజించాలని పిలుపునిచ్చారు.
BDK:పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా నిరంతరం పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. అయోధ్య అన్నారు. ఆదివారం మణుగూరు సమితి సింగారంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజల హక్కుల కోసం సీపీఐ పోరాడుతుందని చెప్పారు. పేద ప్రజలకు, ప్రజా పోరాటాలకు ఎర్రజెండా దిక్సూచి అని తెలిపారు. మణుగూరు అభివృద్ధిలో సీపీఐ పాత్ర మరువలేనిదన్నారు.
ATP: జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ఆదేశాలతో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి తదితర పట్టణాల్లోని బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. అసాంఘిక శక్తులను అణచి వేయాలనే లక్ష్యంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
JGL: ధర్మపురి పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోరుట్ల నియోజకవర్గంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కోరుట్లలో అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
భారత గగనతంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధవిమానాలను నేలకూల్చామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రశిబిరాలు, పాక్ ఎయిర్ డిఫెన్స్పై దాడి చేసిన మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. కూల్చివేసిన పాక్ విమానాల వివరాలను ఇప్పుడు వెల్లడించలేమని తెలిపారు.
సత్యసాయి: గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధి కల్లితాండకు చెందిన వీరజవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. మృతదేహం శనివారం బెంగళూరు నుంచి చేరే వరకు మంత్రి సవితమ్మ అక్కడే ఉండి పర్యవేక్షించారు. నేడు అంత్యక్రియల అనంతరం మురళి నాయక్ తల్లిదండ్రులకు ఆమె దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించారు.
AKP: నాతవరం మండలం వైబీ.పట్నం గ్రామానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంటుగా నియమితులైన చిటికెల గంగునాయుడు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియామక పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో బాగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్, తాండవ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ కరక సత్యనారాయణ పాల్గొన్నారు.
TPT: ఈనెల 13న రోశనూరు జడ్పీ హైస్కూల్లో జిల్లా రెజ్లింగ్ మాన్ అండ్ ఉమెన్, బాల బాలికల జట్ల ఎంపికలు జరగనున్నాయి. అండర్-23, అండర్-17 విభాగంలో ఈ సెలక్షన్లకు వచ్చే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ అనుదీప్, ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ ఉదయ్కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9000024837 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా కళ్యాణ కట్ట రూ.1,70,000, VIP దర్శనాలు రూ.13,05,000, బ్రేక్ దర్శనాలు రూ.5,97,300, ప్రసాద విక్రయాలు రూ.22,43,690, కార్ పార్కింగ్ రూ.6,08,500, వ్రతాలు రూ.2,02,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 63,64,480 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.
VSP: అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని దుర్మార్గాలకు పాల్పడుతుందని, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పెల్ల నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన సీపీఐ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చిచ్చుపెట్టి తమ వైపు తిప్పుకొని ప్రతిసారి బీజేపీ కేంద్రంలో అడుగుపెడుతుందని అన్నారు.
నెల్లూరు: మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి వారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజల ఆరోగ్యానికి వరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, సలాం, కురువ మన్యం పాల్గొన్నారు.
SRPT: మోడీ పాలనలో కార్పొరేట్లకే రెడ్ కార్పెట్ వేస్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లోని అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాల వల్ల అన్ని రంగాలు నిర్వీరం అయ్యే పరిస్థితి దాపురించిందని, ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.
NLG: నకిరేకల్లోని గురు మందిరంలో వేసవి బాలల సంస్కార శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. విశ్వహిందూ పరిషత్, జిల్లా మాతృ శక్తి ఆధ్వర్యంలో పది రోజుల శిక్షణలో 100 మందికి పైగా బాలలు పాల్గొని శ్రీరామాయణం, నిత్య ప్రార్ధన శ్లోకాలు, హనుమాన్ చాలీసా, ఆటలు, వ్యాయామం, కథలు, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి అంశాల్లో శిక్షణ పొందారు.
SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులోని దర్గా వద్ద కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.