NGKL: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ లేనందున సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు తెలిపారు. ఈనెల 13న సోమవారం సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
KMR: బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో నియోజకవర్గస్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్దంగా పోకుండా కేవలం బీసీలను మభ్య పెట్టేందుకు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.
MBNR: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని TGUTAF జిల్లా అధ్యక్షులు రవికుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యుటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల మహాసభలు నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
NZB: సాలూర మండలంలోని ఖాజాపూర్ వాగుపై గల వంతెన రైలింగ్ దెబ్బతినడంతో ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ఏమాత్రం ఏమరుపాటుగా వాహనాలు నడిపినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగకముందే దెబ్బతిన్న రైలింగ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని SI మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా సిద్ధవటంలో శుక్రవారం రాత్రి ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహంలో వస్తుండగా మద్యం సేవించినట్లు నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసామన్నారు.
NRML: భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను అలాగే కేసుల పురోగతిని తెలుసుకొన్నారు. అనంతరం పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. గ్రామాలలో గస్తీ, పెట్రోలింగ్ చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
MNCL: PM మోదీ రైతుల సంక్షేమార్థం రూ.42 వేల కోట్ల లాభదాయక పథకాలను ప్రారంభించడం జరిగిందని బెల్లంపల్లి KVK సమన్వయకర్త ప్రసూన తెలిపారు. శనివారం PM ధన ధాన్య కృషి యోజన కార్యక్రమం రైతులకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. రైతులు KVK కేంద్రం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన సేవలు అందిపుచ్చుకోవాలన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండించి లాభాలు సాధించలన్నారు.
AP: PPP విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలేజీల నిర్మాణం పూర్తైతే 180 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే పేదవారికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. కాగా గడిచిన 16 నెలల్లో చేసింది ప్రారంభం మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉందని తెలిపారు.
HYD: ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంట నివాసి మొహమ్మద్ షదాబ్(35) అనే క్యాబ్ డ్రైవర్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, షదాబ్ చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసారు.
KDP: శనివారం కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన సారా ఇర్ఫాన్ మూడు సిల్వర్ మెడల్స్ సాధించింది. దీంతో విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు సారా ఇర్ఫాన్ ఎంపికయ్యారు. అండర్-14 ఇన్ లైన్ విభాగంలో రోడ్-1, రింగ్-3, రింగ్-4 కేటగిరిలో ప్రతిభను సాధించింది.
VZM: స్థానిక మ్యూజిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ – కం – సేల్స్ కు వినియోగదారుల నుండి విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి పేర్కొన్నారు. శుక్ర, శనివారాలలో 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రూ. 25,000 పైగా లబ్ధి పొందినట్లు ఆమె తెలిపారు. జీఎస్టీ చెల్లింపుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నమన్నారు.
W.G: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆచంట మండలం కొడమంచిలి గ్రామ సర్పంచ్ సుంకర సీతారాం అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని కోడేరు గ్రామ కమిటీ నియామకాన్ని ఆయన నియమించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మామిడిశెట్టి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. అనంతరం వారిని అభినందించారు.
BDK: పాల్వంచ సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం సందర్శించారు. రైతుల వద్ద నుంచి పాల సేకరణ కేంద్రం, విజయ డైరీ ద్వారా కేంద్ర ఏర్పాటు, సొసైటీ భవన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తోపాటు పాలకవర్గం సభ్యులు రైతు సమస్యలపై కలెక్టర్కు వివరించారు.
KDP: అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు.
SKLM: ప్రజలు అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ఎంపీటీసీలకు గత 16 నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న వాళ్లకు వేతనాలు ఇప్పించాలని మండల వైస్ ఎంపీపీ గునుపురం రామారావు కోరారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలు వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఎంపీటీసీలకు కనీసం రాజ్యాంగం ప్రకారము ఇవ్వవలసిన వేతనాలు కూటమి ప్రభుత్వం అందించలేదన్నారు.