• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చీమకుర్తిలో గ్రానైట్ క్వారీని పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: చీమకుర్తి మండలం కంభంపాడు సమీపంలోని RRR గ్రానైట్ క్వారీని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మైనింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. క్వారీలో జరుగుతున్న తవ్వకాలు, నిబంధనల అమలు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:51 PM IST

తొలి జీతం విద్యార్థుల కోసం ఖర్చు చేసిన చైర్‌పర్సన్

అనంతపురం రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. తన మొదటి నెల జీతంతో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, ఇతర వస్తువులను అందజేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం త్వరలో పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజలో ఆమె పాల్గొన్నారు.

March 12, 2026 / 02:50 PM IST

ఒంటిపూట బడులు.. షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలో పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి16నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. 8AM నుంచి 12.30PM వరకు స్కూల్స్ నడపనున్నారు. మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో 1PM గంట నుంచి 5PM వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.

March 12, 2026 / 02:49 PM IST

గుడివాడలో పర్యటించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ గౌతు లచ్చన్న విగ్రహం సమీప ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాగునీటి సరఫరా సమయంలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. డ్రైన్ క్రాస్ వద్ద ఉన్న హౌస్ హోల్డ్ వాటర్ కనెక్షన్‌ను పరిశీలించి, సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

March 12, 2026 / 02:49 PM IST

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి కార్ల ధరలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. భారత్‌లోని అన్ని రకాల మోడళ్లపై 2% వరకు పెంచుతామని వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా బ్రాండ్ డెరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటనలో తెలిపారు. Q3 SUV నుంచి SUV RS Q8 వరకు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తోంది.

March 12, 2026 / 02:47 PM IST

‘బీఫాం వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’

WNP: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని, కానీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పార్టీ వనపర్తి భీఫామ్ ఇచ్చి, తిరిగి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చెప్పారు. పిల్లలు గుర్తుకు రావడంతో మానుకున్నాని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గమనే 2 వర్గాలుండేవని ఆయన పేర్కొన్నారు.

March 12, 2026 / 02:45 PM IST

తిరుమలలో మేయర్ పాక సురేష్ కుమార్ స్వామి దర్శనం

KDP: తిరుమలలో గురువారం కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శంకర్, శేషారెడ్డి 20వ డివిజన్ ఇంఛార్జ్ శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 12, 2026 / 02:45 PM IST

గోల్డ్ షోరూంను ప్రారంభించిన.. మంత్రి, MLA

HNK: నక్కలగుట్టలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథులుగా మంత్రి సురేఖ, MLAలు KR నాగరాజు, రాజేందర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:44 PM IST

జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

MHBD: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) వెల్లడించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

March 12, 2026 / 02:44 PM IST

భారత్‌కు రెండు టీ20 టీమ్స్ అవసరం: దాదా

భారత్ రెండు టీ20 జట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, రాహుల్, పంత్ వంటి ప్లేయర్లకు అవకాశాలు రావడం లేదన్నాడు. అలాగే, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ వంటి వారికి జట్టులో చోటు దక్కినా ప్లేయింగ్-11లో అవకాశం రావడం లేదని గుర్తుచేశాడు. అందుకే భారత్ రెండు జట్లను ఆడించాలని గంగూలీ వ్యాఖ్యానించాడు.

March 12, 2026 / 02:43 PM IST

సైడ్ డ్రైన్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD;: మాచర్ల పట్టణంలోని 13వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ల పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రైన్ల నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో ఆయన వెంట పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 02:43 PM IST

నగరిలో 17న జాబ్ మేళా

CTR: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 17న నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ తెలిపారు. ఈ మేళాకు 20కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై దాదాపు 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 10Th, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు.

March 12, 2026 / 02:41 PM IST

నంది మేడారంలో బోర్‌వెల్ ఏర్పాటు

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో బోర్వెల్ తవ్వించారు. స్థానిక గంగపుత్ర కాలనీలో వేసవికాలం సందర్భంగా తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి బోర్వెల్ మంజూరు చేయించారు. ఇవాళ బోర్వెల్ వేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో నాయకులు, కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 02:41 PM IST

గురుకుల పాఠశాలను సందర్శించిన జేసీ

ప్రకాశం: కొండపి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఒంగోలు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థునులతో ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థునుల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. 10వ తరగతి విద్యార్థులను విద్యాబోధన జరిగే తీరును అడిగారు.

March 12, 2026 / 02:41 PM IST

‘అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం’

SRCL: అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు విధులపై శిక్షణ ఇచ్చారు.

March 12, 2026 / 02:41 PM IST