VZM: టాయిలెట్లు లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేసి వారంలోగా కొత్త భవనాల్లోకి మార్చాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో ICDS అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి టాయిలెట్ లేని వారికి, అదే విధంగా విద్యుత్ సరఫరా లేని భవనాల జాబితాలను అందించాలన్నారు.
NLG: వేసవి కాలం రాను నందున అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులను తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తాసిహల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు..
RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాదులో BRS మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి స్రవంతి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
VZM: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 5గురు ముద్దాయిలకు ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు జరిమాన విధించారని ఎస్సై కె. వెంకట సురేష్ తెలిపారు. పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని సాలూరు కోర్టులో హాజరుపరిచామని, మెజిస్ట్రేట్ వి.కనకమహాలక్ష్మి జరిమాన విధించిందరాన్నారు.
KNR: వికసిత భారత్లో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్పై ఇవాళ కరీంనగర్లో మేధావుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరీ జయశ్రీ, తదితరులు పురందీశ్వరికి స్వాగతం పలికారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక కాలంలో పిల్లలకు మమతను రాగాలు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని వాటిపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు.
ASR: అనంతగిరి మండలంలోని బొర్రాలో శుక్రవారం ఆరోగ్య రథం ద్వారా డాక్టర్ చైతన్య రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. వైద్యులు మాట్లాడుతూ.. ఆరోగ్య రథం ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలను గ్రామాల్లో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, వ్యక్తి గత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని సూచించారు.
TG: హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది ఎంతో చాకచక్యంగా లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
NLG: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం జిల్లాలో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ASR: మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించిన కూనవరం మండలంలోని ఐదు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కూనవరం ఎలీ యూనిట్-1 నసరయ్య తెలిపారు. వాల్ఫర్ పేట, కూడేల్లిపాడు, టేకుబాక, కూనవరం, టేకులబోరు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహిస్తామన్నారు.
ASR: జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో సత్తా చాటిన రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ కొండబాబును శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం ఘనంగా సత్కారించింది. ఈ సందర్భంగా హెచ్ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందిన కొండబాబు జిల్లాకే గర్వకారణం అన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం శరభవరంలో దాట్ల చరిత అనే గిరిజనేతర మహిళ చేపడుతున్న శాశ్వత ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయాలని పెసా కమిటీ ఉపాధ్యక్షులు పప్పుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇంటి నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రకాశం: చంద్రశేఖరపురంలోని భైరవకోనలో ఈనెల 26న జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్ల పనులను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ASR: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.