PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో బోర్వెల్ తవ్వించారు. స్థానిక గంగపుత్ర కాలనీలో వేసవికాలం సందర్భంగా తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి బోర్వెల్ మంజూరు చేయించారు. ఇవాళ బోర్వెల్ వేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో నాయకులు, కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.