ప్రకాశం: చీమకుర్తి మండలం కంభంపాడు సమీపంలోని RRR గ్రానైట్ క్వారీని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మైనింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. క్వారీలో జరుగుతున్న తవ్వకాలు, నిబంధనల అమలు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.