KDP: చాపాడు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో రూ.2.40 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. స్కూల్ అభివృద్ధికి మినీ ట్రాన్స్ఫార్మర్, ఆటస్థలం అభివృద్ధి, స్టేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.