E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం గురువారం విజయవంతంగా జరిగింది. స్థానిక GNR కళ్యాణ మండపంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కాల సూరిబాబు, ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కార్యదర్శిగా ఏ.సూర్యచంద్ర రావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.