BHPL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ఇవాళ లిఫ్ట్ వైర్ తెగి జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆరుగురు మీడియా ప్రతినిధులు 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన జర్నలిస్టులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.