KRNL: ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుడు నందవరం(మం) పెద్ద కొత్తలి సమీపంలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యాడు. అటుగా వెళ్తున్న ముగ్గురు పాత్రికేయులు గోవిందు, కుమార్, భీమన్న స్పందించి సీపీఆర్ చేయడంతో కొద్దిసేపటికి అతను స్పృహలోకి వచ్చాడు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించాడు. పాత్రికేయులను స్థానికులు అభినందించారు.