ELR: గత ఆర్ధిక ఏడాది వివిధ శాఖల ద్వారా రూ.18.45 కోట్ల విలువ గల 1013 ఉపాధి హామీ పనులు చేపట్టామని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రజా వేదిక పేర నిర్వహించారు. తనిఖీ కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం సహాయ పధక సంచాలకులు శ్రీనివాస్ నిర్వహించారు.