నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జనసేన నగర కార్యాలయాన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ONUDA) ఛైర్మన్ షేక్ రియాజ్ సందర్శించారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించిన రియాజ్.. నెల్లూరులో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసిన జనసైనికులను అభినందించారు.