KMR: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సదాశివనగర్ మండలం పద్మాజీవాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.