కోనసీమ: రామచంద్రపురంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో CSR నిధులు రూ.16 లక్షలతో నిర్మించనున్న డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. దీని ద్వారా కిడ్నీ రోగులకు సులభంగా చికిత్స అందజేయవచ్చు అన్నారు.