NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చింతపల్లి మండలంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 4.75 కోట్లతో బీటీ రోడ్డు, రూ. 3.60 కోట్లతో 36 మహిళా సమాఖ్య భవనాలు మరియు వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం MLA ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.