ATP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కామర్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సెట్-I ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 5,223 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,937 మంది హాజరు కాగా, 286 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.