NTR: నందిగామలోని వై. జంక్షన్ వద్ద రాత్రి ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను పరిశీలించి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సీఐ వైవిఎల్ నాయుడు, ఎస్సై అభిమన్యు, ట్రాఫిక్ ఎస్సై నరేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
SRPT: హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్కు పాలకవర్గానికి శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి పథంలో నడిపేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించింది.
VSP: యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. అమ్మాయికి నచ్చకపోతే బలవంతంగా పెళ్లి చేసుకోకూడదన్నారు. ఈ ఆవేశంలో చాలా ఉన్మాదాలు జరుగుతున్నాయన్నారు. తను కూడా 25 సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని కానీ వాళ్లు ఒప్పుకోలేదన్నారు. అర్థం చేసుకొని వేరే మహిళను పెళ్లి చేసుకున్నానన్నారు.
VSP: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర జలాలో చేపల వేట నిషేధమని విశాఖ మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. సముద్ర జలాలలో చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కోసం వేట నిషేధం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే బోట్లను, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రాయితీలు నిలిపివేస్తామన్నారు.
MDK: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నార్సింగి మండల కేంద్రంతో పాటు నర్సంపల్లి గ్రామంలో శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు తెలిపారు. నర్సంపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో జరిగే అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కృష్ణా: నాగాయలంక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో ఇవాళ బోట్ల ఎన్యూమరేషన్ మత్స్య శాఖ అధికారులు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సేవ సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు తెలిపారు. ఆయన నాగాయలంక మత్స్య భవనం వద్ద విలేఖరులతో మాట్లాడారు. బోట్ల యజమానులు కళాసీలతో పాటు అవసరమైన అన్ని పత్రాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో హాజరు కావాలన్నారు.
HYD: భారతరత్న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం కాచిగూడ చెప్పల్ బజార్లో బీజేపీ నేతలు భారత రాజ్యాంగంపై స్కూల్ పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్య క్రమంలో బీజేపీ నేతలు శ్యాంరావు, బల్వీర్, శీర్ సాగర్, శ్రీకాంత్, కృష్ణకుమార్, సుభాష్ పటేల్, ఆరవింద్, సి. వినోద్ యాదవ్, వాసు, ఉన్నారు.
కృష్ణా: గ్రామాల్లో అధ్వానంగా మారిన అంతర్గత రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గురువారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో రూ.43లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ముస్తాబాద్లో రూ.71లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం పంచమి: రా. 1-11 తదుపరి షష్ఠి మూల: పూర్తి వర్జ్యం: మ. 1-13 నుంచి 2-51 వరకు తిరిగి తె. 4-50 నుంచి అమృత ఘడియలు: రా. 11-04 నుంచి 2-51 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-15 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-23 నుంచి 1-13 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: […]
వాంఖడే వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21*) పరుగులు చేశారు. SRH బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీశాడు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయా కేసుల్లో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కారాగారంలో తనపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. అయితే, వీటిని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ తోసిపుచ్చారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించడం కాకుండా.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. జూలై నెల కోటాను ఏప్రిల్ 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
KMM: ముదిగొండ మండలంలో ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం క్రింద మొత్తం 5,235 ధరఖాస్తులు వచ్చాయని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీజకు MPDO శ్రీధర్ స్వామి వివరించారు. ఎస్సి, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఈబీసి, ఎంబీసీ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా 3280 దరఖాస్తులు, ఆఫ్ లైన్ ద్వారా 1955 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ విజిట్లో భాగంగా వివరాలను వెల్లడించారు.
NDL: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంబార్కేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డా. ఎస్. ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
KRNL: ఆదోని మాజీ MLA సాయి ప్రసాద్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. అలసందగుత్తి గ్రామానికి చెందిన వీరాంజనేయులు, నాగేంద్ర గార్ల కుమార్తె, కుమారుడి పెళ్లికి బంగారు తాళిబొట్టు, వెండి మెట్లు ఇవాళ అందించారు. పేద మహిళల ఆడపిల్లల పెళ్లికి తాళిబొట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని మాజీ MLA అన్నారు. ఈ కార్యక్రమంలో YCP యువజన అధ్యక్షుడు నల్లా రెడ్డి తదితరులు ఉన్నారు.