• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గిద్దలూరు ఎంఈవో-2గా నాగ భూషణ్ రెడ్డి

ప్రకాశం: గిద్దలూరు ఎంఈవో-2గా పి.నాగభూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఎమ్మార్సీ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఎంఈవో జింకా వెంకటేశ్వర్లు గత నెలలో రిటైరయ్యారు. ఆ స్థానంలో నాగభూషణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

March 27, 2025 / 07:52 AM IST

భగభాన్ పాలైకి 10 ఏళ్ల జైలు శిక్ష

ATP: ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్లు కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టుకు హాజరుపరచగా ముద్దాయికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

March 27, 2025 / 07:47 AM IST

కాకాణిని అరెస్ట్ చేస్తారా ?

NLR: మాజీ మంత్రి కాకాణి ఇంటి వద్ద బుధవారం రాత్రి ఉత్కంఠ నెలకొంది. ఆయనపై నమోదైన పలు కేసుల నేపథ్యంలో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఆయన ఇంటి వద్దే ఉంటూ పరిస్థితి గమనిస్తున్నట్లు సమాచారం.

March 27, 2025 / 07:30 AM IST

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే

TPT: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ చంద్రశేఖర రావు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో తిరుపతి పడమర ప్రాంతాల పరిధిలోని జీఎస్ మాడా వీధి, కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు, చిన్న బజారు వీధి ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 27, 2025 / 07:05 AM IST

హైవే పక్కన అస్థిపంజరం లభ్యం

NLR: ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అల్లిపురం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని పూర్తిగా ఎముకల గూడుగా ఉన్న అస్థిపంజరం లభ్యమయింది. ఈ అస్థిపంజరం మగ వ్యక్తిదని, చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 58-60 ఏళ్ల మధ్య ఉండొచ్చని ఆత్మకూరు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా ఈ శవం ఆనవాళ్లను గుర్తిస్తే 9440796390 నంబరుకు వివరాలు తెలియజేయాలని ఎస్సై కోరారు.

March 27, 2025 / 07:02 AM IST

ఈ నెల 30న స్విమ్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు రద్దు

TPT: ఈ నెల 30వ తేదీన స్విమ్స్ ఉచితంగా నిర్వహించే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు రద్దు చేసినట్లు ఎంఎస్ డా.రామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం గర్భిణులకు ఉచితంగా నిర్వహిస్తుండగా ఉగాది నేపథ్యంలో రద్దుచేసి మార్చి 6వ తేదీన యథా తథంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

March 27, 2025 / 06:48 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం

CTR: జిల్లా పరిధిలో గురువారం నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 27, 2025 / 06:15 AM IST

టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం DSC నిర్వహించాం: CM

TG: టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం డీఎస్సీ నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లను బదిలీ చేసినంత ఈజీ కాదు టీచర్లను బదిలీ చేయడమంటూ వ్యాఖ్యానించారు. ఒక్క ఆరోపణ కూడా రాకుండా 36 వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేశామని తెలిపారు. 20 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని పేర్కొన్నారు.

March 26, 2025 / 08:26 PM IST

పలు ప్రాంతాలలో డీఎస్పీ పర్యటన

GNTR: నగరంలోని పలు ప్రమాద ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలను బుధవారం డీఎస్పీ రమేష్ పరిశీలించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెస్ట్ ట్రాఫిక్ సీఐని, ఇతర పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, STOP బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలన్నారు.

March 26, 2025 / 08:19 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌’

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దర్శి టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి బుధవారం వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.

March 26, 2025 / 08:10 PM IST

కసాపురం ఆంజనేయస్వామి హుండీ ఆదాయం ఎంతంటే.?

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం భక్తాదుల స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కింపు చేశారు. 103 రోజుల హుండీ కానుకలను లెక్కించగా.. రూ. 67,49,285 నగదు, 37 అమెరికన్ డాలర్లు, 4 గ్రాముల బంగారు, 1 కేజీ 900 గ్రాములు, 100 మిల్లీగ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈఓ వాణి మీడియాకు తెలిపారు.

March 26, 2025 / 07:53 PM IST

ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే శాసనసభ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆయన నేడు విజయవాడలో జరుగుతున్న సమావేశానికి హాజరు కావడంతో ఇఫ్తార్ విందులో పాల్గొనలేకపోయారు. దీంతో వీడియో కాల్ ద్వారా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకంక్షలు చెప్పారు.

March 26, 2025 / 07:40 PM IST

రాజన్న ఉండి ఆదాయం వివరాలు ఇవే..!

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం నుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 1 కోటి 95 లక్షల 75 వేల 168 వచ్చినట్లు ఈవో వినోద్ ఒక ప్రకటన తెలిపారు. బంగారం 287 గ్రాములు, వెండి 18 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. 20 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

March 26, 2025 / 07:36 PM IST

‘శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రంకు తరలించాలి’

SRCL: యాసంగి సీజన్‌లో పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశించారు. యాసంగి 2024-25 వరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావే శానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు.

March 26, 2025 / 07:34 PM IST

జిల్లాలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. రొద్దం, రామగిరి, గాండ్లపెంట, కంబదూరు, కణేకల్లులో ఎంపీపీ స్థానాలకు, ఉరవకొండ, ఎల్లనూరు, పెద్దప్పూరు, రాయదుర్గంలో ఉప ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రారంభించాలని సీఈవో రామచంద్రారెడ్డి తెలిపారు.

March 26, 2025 / 07:00 PM IST