• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ మందగమనం

ప్రకాశం: ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని సీపీఎం నాయకులు పునాటి ఆంజనేయులు విమర్శించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు.

February 21, 2025 / 04:38 PM IST

విజయదుర్గమ్మను దర్శించుకున్న నగర మేయర్

VSP: హనుమంతువాకలోని విజయదుర్గ కాలనీలోని విజయ దుర్గ వార్షిక మహోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. అమ్మవారు నగర ప్రజలను కాపాడాలని, నగరాభివృద్ధి జరిగేటట్లు చూడాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

February 21, 2025 / 04:30 PM IST

‘ఆలయ పునర్నిర్మాణంలో అవినీతిపై విచారణ జరపాలి’

VSP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణం పేరుతో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు పిల్లా నూకేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎలమంచిలి తహశీల్దార్‌కు ఆయన వినతిపత్రం అందించారు.

February 21, 2025 / 04:20 PM IST

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

SDPT: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారం‌లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు.

February 21, 2025 / 03:29 PM IST

అర్హత మేరకు రైతులకు వ్యవసాయ రుణాలు

SDPT: అర్హత మేరకు రైతులకు వ్యవసాయరుణాలు అందించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరిబాబు బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్‌లో సిద్దిపేట బ్లాక్ 16మండలాలు, 3మున్సిపాలిటీలకు సంబంధించి జాయింట్ మండల బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అన్ని ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.

February 21, 2025 / 03:24 PM IST

తమిళనాడు సీఎంనకు ధర్మేంద్ర ప్రధాన్ లేఖ

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ‘హిందీ భాషపై రాజకీయాలు చేయటం సరికాదు. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. విద్యార్థుల భవిష్యత్ కోసమే జాతీయ విద్యా విధానం. BJP అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా రాజకీయాలకతీతంగా ఈ విద్యా విధానం అమలు జరిగింది. ఈ విధానం అమలు చేయకపోవటం వల్ల తమిళనాడుకు రూ.5 వేల కోట్ల నిధులు రాలేదు’ అని తెలిపారు.

February 21, 2025 / 02:28 PM IST

జ్ఞాన జ్యోతి శిక్షణను ఉపయోగించుకోవాలి: MEO

ASR: జ్ఞాన జ్యోతి శిక్షణను అంగన్వాడీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలని డుంబ్రిగూడ MEO సుందరరావు అన్నారు. శుక్రవారం బిల్లాపుట్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, మాట్లాడారు. పిల్లల సమగ్రాభివృద్దికి నాణ్యమైన పౌష్టికాహారం అందిచాలని, ఆటపాటలతో విద్య నేర్పించాలని అన్నారు. కాగా, మొదటి విడతలో 106 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు CDPO నీలిమ తెలిపారు.

February 21, 2025 / 02:20 PM IST

పెరుమాళిలో నేత్ర పరీక్షలు

VZM: తెర్లాం మండలం పెరుమాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత నేత్ర శిబిరం నిర్వహించారు. ఈ నేత్ర శిబిరాంలో 45 మందికి తనిఖీలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ఞ రమని, ఆప్తమాలిక అధికారి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2025 / 02:19 PM IST

SA vs AFG: టాస్ గెలిచిన సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘాన్: గుర్బాజ్, జద్రాన్, అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), ఒమర్జాయ్, గుల్బాదిన్, నబీ, రషీద్, ఫరూఖీ, అహ్మద్సౌతాఫ్రికా: రికెల్టన్, డి జోర్జి, బావుమా(c), వాన్ డెర్ డుస్సెన్, మార్క్రామ్, మిల్లర్, ముల్డర్, జాన్సెన్, మహరాజ్, రబడ, లుంగీ ఎంగిడీ

February 21, 2025 / 02:19 PM IST

భారీ మెజారిటీతో గెలిపించండి: ఎంపీ నగేష్

NRML: బైంసా పట్టణంలో నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసే అంజి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.

February 21, 2025 / 02:03 PM IST

ఈ నెల 26న వాహనాల బహిరంగ వేలం

W.G: కొవ్వూరు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా, ఇతర నేరాల్లో పట్టుబడిన మోటారు వాహనాలకు వేలం వేయనున్నారు. రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 11గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనేందుకు రూ.5వేలు చెల్లించాలన్నారు.

February 21, 2025 / 01:56 PM IST

పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

ASR: రానున్న పదవ తరగతి రెగ్యులర్, ఇంటర్ రెగ్యులర్, సార్వత్రిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, 144 సెక్షన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

February 21, 2025 / 01:47 PM IST

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

SRD: చౌటకూరు మండలం చక్రియాల్ గ్రామంలోని అంగన్వాడి, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ నాయకులు చిన్న గొల్లపాటి రాజశేఖర్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాన్ని వమ్ము చేయకుండా లక్ష సాధనతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

February 21, 2025 / 01:43 PM IST

‘గిరిజన మరణాలపై చర్యలు తీసుకోండి’

PPM: గిరిజన విద్యా సంస్థల్లో అన్ని బాగుంటే గిరిజన విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయో గిరిజన శాఖ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 45 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.

February 21, 2025 / 01:38 PM IST

కోర్టు ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ELR: జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులను కలిసి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్‌‌కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

February 21, 2025 / 01:30 PM IST