KMM: ప్రధాన మంత్రి కిసాన్ ధన్ ధనియా కృషి యోజన లైవ్ కార్యక్రమాన్ని ఖమ్మం మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు శనివారం తిలకించారు. సుమారు రూ.42వేల కోట్ల విలువైన వ్యవసాయ ప్రయోజన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను రైతులు వీక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ యారగర్ల హనుమంతరావు,వైస్ ఛైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం ఏ ఆలమ్ పాల్గొన్నారు.
HYD: ప్రజల్లో పెరుగుతున్న ఆహార అలవాట్ల మార్పులతో డయాబెటిస్, ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు HYD ICMR రీసెర్చ్ ఇండియా డయాబెటిస్ అధ్యయనం వెల్లడించింది. దేశ ప్రజలు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా తీసుకుంటున్నారని పేర్కొంది. మొక్కలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన 5 శాతం ప్రోటీన్లను రోజువారి భోజనంలో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందన్నారు.
TG: పెద్దపల్లి(D) అంతర్గాంలో ప్రాంతీయ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక(TESR) తయారీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కన్సల్టెన్సీ ఫీజుల కింద AAIకి రూ.40.53L విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో బసంత్నగర్లో ప్రతిపాదించినా.. నివేదిక అనుకూలంగా రాకపోవడంతో, ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో 591.24 ఎకరాల భూమిని గుర్తించారు.
HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో ఆదివారం మాజీ MLA చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు BRS నాయకులు ఇంటింటికి తిరుగుతూ.. ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ పంపిణీ చేశారు. BRS నేతలు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో BRS నేతల ఉన్నారు.
తమ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% సుంకాలు విధించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. US ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ మండిపడింది. ఈ చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని.. ఇరుదేశాల మధ్య జరగాల్సిన ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయంది. కాగా, అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
HYD: తల్లిదండ్రులపై వేధింపులు పెరుగుతున్నాయి. HYD జిల్లాలో 2025లో సెప్టెంబర్ నెలకి దాదాపు 48 కేసులు తల్లిదండ్రులను పట్టించుకోని కేసులు నమోదయ్యాయి. HYDలో అనేక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. 15 ఉచిత సేవలు అందిస్తున్నాయి. వృద్ధులు ఇబ్బందులు పడితే ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD 7416687878, RR 9515678010, MDCL 9492409781 కాల్ చేయండి.
NLG: సూర్యాపేట తుంగతుర్తిలో నేడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ట్రాఫిక్ ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. జాతీయ రహదారి 365పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నకిరేకల్, మరిపెడ బంగ్లా మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు.
ATP: గుత్తి పట్టణ కేంద్రంలో బాణాసంచా విక్రయాలకు జిల్లా కలెక్టర్, స్థానిక తహసిల్దార్, అగ్నిమాపక శాఖ నుంచి తాత్కాలిక లైసెన్స్ లు తప్పనిసరిగా పొందాలని గుత్తి సీఐ రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా బాణాసంచా షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పనిసరిగా బాణాసంచా విక్రయాలకు అనుమతి తీసుకోవాలన్నారు.
NLR: అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు చికెన్ మార్కెట్ ప్రాంగణంలో ఇవాళ చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ ఒక కేజీ మాంసం రూ. 214 రూ ఫారం ఒక కేజీ మాంసం రూ. 220 రూ బ్రాయిలర్ ఒక కేజీ స్కిన్ లెస్ రూ. 230 ఒక కేజీ చేప ధర రూ. 170 రూపాయలు గతవారంతో పోలిస్తే ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి. ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతూ […]
కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామంలో ఇంటి అల్లుడు కోట ఉదయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అత్తింటి వారు 105 రకాల పిండి వంటలతో గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. కుంపట్ల శ్రీనివాసు, పద్మావతి దంపతులు ఈ పసందైన విందును అల్లుడి కోసం ఏర్పాటు చేశారు. అరిటాకులో వాటిని వడ్డించి సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చారు.
AP: విశాఖలో పర్యటన దృష్ట్యా రోడ్డు పక్కన చెట్లు నరికేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడా చెట్లు కొట్టేయడం లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ అధికారిక ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రోడ్ల సుందరీకరణ పనులను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చట్టరీత్యా నేరమన్నారు.
SRPT: నడిగూడెం మండలంలోని NSP కాలువ పరిధిలో ఉన్న సిరిపురం,నారాయణపురం సహా పలు గ్రామాల ప్రజలు కాలువలో బట్టలు ఉతకడం, స్నానం చేయడం వంటివి చేయకూడదని SI జి.అజయ్ కుమార్ ఇవాళ ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తుండటం వల్ల గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
కోనసీమ: రాజోలు సర్కిల్ పరిధిలో రహస్యంగా మందుగుండు సామగ్రి తయారీ, నిల్వలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ నరేష్ హెచ్చరించారు. ఆదివారం ఆయన రాజోలులో మాట్లాడుతూ.. రాజోలు సర్కిల్ పరిధిలో అక్రమంగా టపాసులు తయారీ, సరఫరా, విక్రయాలు చేసేవారిపై పోలీసు నిఘా ఉంచామన్నారు. అలాగే భద్రత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని వ్యాపారస్తులకు సూచించారు.
KMR: నస్రుల్లాబాద్ గ్రామంలో ఆదివారం ఉదయం గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా మొదలైంది. మొదటగా గండి మైసమ్మ తల్లిని ఆలయంలో ప్రతిష్టించారు. వేడుకల్లో గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. సన్నాయి డప్పులు, కోలాటాలు, నృత్యాల మధ్య గ్రామ దేవతల ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. మహిళలు మంగళ హారతులు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
AP: పల్నాడు(D) వెల్దుర్తి(M) వజ్రాలపాడు పరిధిలోని దావుపల్లితండాలో ఓ వ్యక్తికి మెలియాయిడోసిస్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో డాక్టర్లు మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. గ్రామంలో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. జిల్లా వైద్యాధికారి రవి గ్రామంలో పర్యటించి గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.