KMM: శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న పదవ తరగతి విద్యార్థులకు అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్ విద్యార్థులకు లేఖలు రాశారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో పలు పాఠశాలలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వాళ్లలో మనోధైర్యాన్ని నింపారు.
KMM: మధిరలో ఈ నెల 28 న జరగనున్న మొదటి మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు న్యాయమూర్తి వేముల దీప్తి కోరారు. గురువారం స్థానిక ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పని పనిచేయాలన్నారు.
MHBD: జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పరిధిలోని సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్, MLC తక్కెళ్ళపల్లి రవీందర్, మానుకోట MLA భూక్యా మురళీనాయక్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని వారు సూచించారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి, ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానికులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
MBNR: అధికార కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కొత్త ఇళ్లు కట్టి ఇవ్వాలని ఉన్న ఇళ్లను కూల్చకూడదని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాధితులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం బాధితులకు ఇచ్చినట్టుగా ఆదర్శనగర్ బాధితులకు ఇళ్లు ఇవ్వాలన్నారు.
WNP: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం అధికారులతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA రిజిస్ట్రేషన్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ‘లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి’ కళ్యాణదుర్గం న్యాయవాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దశాబ్దాలుగా పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థకు నిధుల ఇబ్బంది కలగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని రంగయ్య కోరారు.
SRPT: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత, కృత్రిమ అభావంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రేపు కలెక్టర్లు, ఆయిల్ కంపెనీలతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో గురువారం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కిషన్, గ్రామస్థుల ఆధ్వర్యంలో గురువారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలవాలని పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి (45) నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పనులకు వెళ్లిన కొడుకు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో బుధవారం రాత్రి వెతికేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె అల్లాపూర్ శివారు బండమీది గుంత నీటిలో మునిగి చనిపోయింది. ఆలస్యంగా గురువారం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
RR: చేవెళ్ల పరిధి గొల్లగూడలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూర్ పశువైద్యాధికారి డా.దేవేందర్ రెడ్డి పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. వారు మాట్లాడుతూ.. పశువులలో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం పెరగడానికి ఏడాదికి 2 సార్లు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు.
KNR: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా పొన్నం అశోక్ గౌడ్ గెలుపొందడంపై KNR జిల్లా కోర్టులో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా ఛైర్మన్ లక్ష్మయ్య, స్టేట్ జాయింట్ కన్వీనర్ రజనీశ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.
ASR: డుంబ్రిగూడ ప్రభుత్వ హైస్కూల్లో గురువారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన్ చిట్టిబాబు బూడిదే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
SRCL: ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బొప్ప నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానన్నారు. నర్సయ్యను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ఘనంగా సత్కరించారు.