• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్యాస్ కష్టాలపై మంత్రి ఉత్తమ్ సీరియస్

SRPT: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, కృత్రిమ అభావంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రేపు కలెక్టర్లు, ఆయిల్ కంపెనీలతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

March 12, 2026 / 07:38 PM IST

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో గురువారం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 07:37 PM IST

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేత

ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కిషన్, గ్రామస్థుల ఆధ్వర్యంలో గురువారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలవాలని పేర్కొన్నారు.

March 12, 2026 / 07:36 PM IST

నీటిలో పడి మహిళ మృతి

MDK: తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి (45) నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పనులకు వెళ్లిన కొడుకు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో బుధవారం రాత్రి వెతికేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె అల్లాపూర్ శివారు బండమీది గుంత నీటిలో మునిగి చనిపోయింది. ఆలస్యంగా గురువారం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 12, 2026 / 07:35 PM IST

‘ఏడాదికి రెండు సార్లు ఈ టీకాలు వేయించాలి’

RR: చేవెళ్ల పరిధి గొల్లగూడలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూర్ పశువైద్యాధికారి డా.దేవేందర్ రెడ్డి పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. వారు మాట్లాడుతూ.. పశువులలో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం పెరగడానికి ఏడాదికి 2 సార్లు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు.

March 12, 2026 / 07:35 PM IST

కరీంనగర్ జిల్లా కోర్టులో సంబరాలు

KNR: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా పొన్నం అశోక్ గౌడ్ గెలుపొందడంపై KNR జిల్లా కోర్టులో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా ఛైర్మన్ లక్ష్మయ్య, స్టేట్ జాయింట్ కన్వీనర్ రజనీశ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 07:35 PM IST

డుంబ్రిగూడలో వినియోగదారుల హక్కుల దినోత్సవం

ASR: డుంబ్రిగూడ ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన్ చిట్టిబాబు బూడిదే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

March 12, 2026 / 07:34 PM IST

మున్నూరు కావు సంఘం మండల అధ్యక్షులుగా నర్సయ్య

SRCL: ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బొప్ప నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానన్నారు. నర్సయ్యను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ఘనంగా సత్కరించారు.

March 12, 2026 / 07:34 PM IST

కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

MDCL: పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ మండల కార్యాలయం వద్ద తహసీల్దార్ రాములు, మాజీ కార్పొరేటర్లు శాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్, BRS నేతలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

March 12, 2026 / 07:33 PM IST

‘పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి’

BDK: పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం క్లబ్లో గురువారం నిర్వహించిన సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తో కలిసి మాట్లాడారు.

March 12, 2026 / 07:33 PM IST

విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MBNR : జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం స్థానిక MLA అనిరుధ్ రెడ్డి జడ్చర్ల విద్యుత్ శాఖ అధికారులు DE, AE, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గృహ సముదాయాలకు, వ్యవసాయ బోర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.

March 12, 2026 / 07:32 PM IST

పెంకుటిల్లు దగ్ధం.. భారీ ఆస్తినష్టం

KMR: ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైన ఘటన సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సున్నపు రాజుకు చెందిన ఇంట్లో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు, మరొక వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

March 12, 2026 / 07:32 PM IST

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయం రూ‌.17,11,730

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం నిత్య ఖజానాకు రూ.17,11,730 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,45,740, కార్ పార్కింగ్ రూ.2,20,500, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.98,100, ప్రధాన బుకింగ్ రూ.97,750, వ్రతాలతో రూ.92,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.

March 12, 2026 / 07:32 PM IST

DMHOకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం

MHBD: జిల్లాకు చెందిన ఆశ వర్కర్లు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో DMHO రవి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

March 12, 2026 / 07:32 PM IST

డీఈవో ఆఫీస్‌లో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం

NLG: టెన్త్ విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం డీఈవో కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించారు. ఉ. 10:30 నుండి 11:30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారి అనుమానాలను తీర్చారు. ఈ కార్యక్రమం పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది.

March 12, 2026 / 07:32 PM IST