MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఉండేలా సీసీ రోడ్డు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన బైక్లు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయని సీఐ సత్యనారాయణ తెలిపారు. చెత్తకు నిప్పు పెట్టడంతో అది ప్రమాదవశాత్తు వచ్చి స్టేషన్ ఆవరణలోని వాహనాలకు వ్యాపించిందన్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పి వేశారని పేర్కొన్నారు.
KMM: మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు గురువారం వారు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఈ నెల 14వ తేదీన షటిల్ టోర్నమెంట్ ప్రారంభించనున్నట్లు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7,500, తృతీయ బహుమతి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ATP: గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి అత్త బేడల నాగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాప వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నాయకులు బేడల నాగమ్మ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
2026 T20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా విమర్శించాడు. టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించడం అతడు చేసిన పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు. ఈ నిర్ణయంతో మ్యాచ్ ప్రారంభానికి 30 నిమిషాల ముందే కివీస్ ఓడిపోయిందన్నాడు. NZ మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
AKP: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పాయకరావుపేటలో చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. వేసవి సందర్భంగా దాహార్తిని తీర్చేందుకు స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినట్లు స్త్రీ నిధి ఏజీఎం సిద్ధిక్, వెలుగు ఏపీఎం ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు చలివేంద్రం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ASF: తీర్యాని మండల ఆశ్రమ హైస్కూల్లో “పోలీసులు మీ కోసం” కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందజేసి, వారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసుల ఈ చొరవపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను, తిరుపతి విమానాశ్రయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు.
GNTR: విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేశారు.
కృష్ణా: గుడివాడ స్లేటర్ పేట, బేతవోలు ప్రాంతాల్లో గురువారం హెచ్పీవీ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. హెచ్పీవీ టీకా క్యాన్సర్ను నివారించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందని తెలిపారు. 9–14 ఏళ్ల బాలికలు లైంగిక క్రియాశీలతకు ముందు టీకా వేయించడం వల్ల రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు.
BDK: దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అవసరమైన బియ్యం నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు.
KKD: పిఠాపురం పాదగయ జంక్షన్ వద్ద CI శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు గురించి అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
TPT: పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల ఎంపిక కోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కమిషనర్ డీ.వీ. నాగేశ్వరరావు తెలిపారు. భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వీల్చైర్లు, వాకర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేస్తారు.
టీనేజర్లు ఉదయాన్నే నిద్రకళ్లతో స్కూల్ వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వారి తప్పు కాదని, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే స్కూలు సమయం గంట ఆలస్యంగా మారడం వల్ల విద్యార్థులు రోజుకు అదనంగా 45ని. పాటు ఎక్కువ నిద్రపోగలిగారు. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, అలసట తగ్గి ఉత్సాహంగా కనిపించారు.