SRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మరియు సభను హుజూర్నగర్లో విజయవంతం చేసిన హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు.
NLG: జర్నలిస్టులు తమ సమస్యల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని TUWJ(IJU) జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఆ సంఘ నాయకులు ఆదివారం చండూరులో వెంకన్నను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పంచాంగం అందజేశారు. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి అంత ఐక్యమత్యంగా పనిచేయాలని నిర్ణయించారు.
PPM: సాలూరులో ఆదివారం నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని సాలూరు పట్టణంలో వెలమపేట, డబ్బివీధి ప్రజలు శ్రీరాములు స్వామి వారి విగ్రహాలను కోలాటాలతో, మేళతాళాలతో రథంలో ఊరేగిస్తూ వారి మండపాలకు తీసుకువచ్చారు. రాజన్నదొర భక్తులతో కలిసి రథాన్ని లాగారు.
VSP: సింధియా నుంచి గాజువాక వెళ్లే దారిలో జింక్ గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సమీపంలోని ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కాణాలు తెలియాల్సి ఉంది.
VSP: రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్కు సంప్రదించాలన్నారు.
కృష్ణా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉగాది సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బృందానికి ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నట్లు సుజనా తెలిపారు.
BPT: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం ఉన్నత పాఠశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు బాపట్ల జూనియర్ హాకీ బాలుర జట్టును ఎంపిక చేసినట్లు హాకీ బాపట్ల సంఘం కార్యదర్శి వీర చంద్ర తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 6 నుంచి ధర్మవరంలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
SKLM: అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ మేరకు పోలాకి మండలం CP రోడ్డు నుండి చీడివలస వరకు రూ.1.75 లక్షలతో 3200 మీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజచేసి, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు.
NDL: ఇటీవలే ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవింద రెడ్డిని ఆదివారం స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్ మున్నా వారి మిత్ర బృందంతో కలిసి శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది. స్పోర్ట్స్ డైరెక్టర్లు, సలహా దారులు, తైక్వాండో అధ్యక్షులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
చిత్తూరు: కుప్పం మండలం నడుమూరు పంచాయతీ, బోధ గుట్టపల్లి గ్రామంలో దళిత హక్కుల పరిరక్షణ సమావేశం ఆదివారం కుప్పం తహసీల్దార్ చిట్టి బాబు అధ్యక్షతన జరిగింది. తహసీల్దార్ చిట్టిబాబు మాట్లాడుతూ.. అంటరానితనం నిర్మూలనలో భాగంగా ప్రతినెల 30వ తేదీన దళిత వాడలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు.
KRNL: ఆలూరు మండలం కురుకుంద గ్రామంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గ్రామంలో నీటి వనరులన్నీ దాదాపు ఎండిపోవడంతో, స్థానికులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. పండగ వేళ కూడా బిందెడు నీటి కోసం గ్రామస్థులు రాత్రి వేళల్లోనూ జాగారం చేస్తున్నారు. ట్రాక్టర్లో డ్రమ్ములు పెట్టుకొని నీటీని తెచ్చుకుంటున్నారు. అధికారు స్పందించాలని కోరారు.
ATP: ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నాగసముద్రంలో నేడు అత్యధికంగా 40.9°C ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ నీళ్లు తాగాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అనంతపురం: రామగిరి మండలంలో కురబ లింగమయ్యను పరిటాల చిన్నాన కొడుకు రమేశ్, అతని కొడుకు ఆదర్శ్, నాయుడు, ఆదిత్య, నవకాంత్ కలిసి రాడ్లతో కొట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగమయ్య చనిపోయాడని అన్నారు. పోలీసులు టీడీపీ వాళ్లకి మద్దతు పలుకుతున్నారని, ఏం చేసినా చెల్లుతుందని వాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
HNK: ముస్లిం సహోదరులకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలన్నారు.