MBNR: జిల్లా కేంద్రంలో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు మెమొరాండం అందజేశారు. ఫిబ్రవరి 23, 2026 హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల సాగు భూమి, పింఛన్, ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని 16 మార్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.
SRD: కంది తహసీల్దార్ కార్యాలయాన్ని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.
KNR: జమ్మికుంట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని సుమారు 28 ఏళ్ల యువకుడు ఆర్వోబీ సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
GDWL: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,110 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో బాలికలు 4,199 మంది బాలురు, 3,858 మంది, 53 మంది ఒకసారి విఫలమైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
SDPT: విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా సూచించారు. కొండపాక మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన “రోల్ మోడల్తో సంభాషణ” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పాఠశాల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇంటి బాధ్యులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సందర్బంగా జాదవ్ ప్రేమ్ సింగ్ ఇల్లు మంటతో పూర్తిగా కాలిపోవడంతో తక్షణ సహాయం కింద రూ. 30,000 అందజేశారు. అదేవిధంగా నిత్యవసరుకులు పంపిణి చేశారు. ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తమదని హామీచ్చారు.
PDPL: రామగుండం NTPC పార్టీ కార్యాలయంలో గురువారం విద్యార్థుల రాజకీయ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ తమ్మెర పేర్కొన్నారు. అనంతరం పార్టీ రామగుండం మున్సిపాలిటీ ఏరియా ఇంఛార్జ్గా మనాల భవాని శంకర్ను నియమించారు.
SDPT: జగదేవ్పూర్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి రవి కుమార్, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి సమక్షంలో లెక్కింపు చేపట్టారు. గత 62 రోజుల్లో హుండీ ద్వారా రూ.14,19,800 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
KNRL: తుగ్గలిలో ఈనెల 16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రమా వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. జొన్నగిరి, పెండేకల్, తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నోవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 612 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలురాయనున్నారని వెల్లడించారు.
అన్నమయ్య: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని DRO మధుసూదన్ రావు గురువారం స్పష్టం చేశారు. మదనపల్లిలో గ్యాస్ ఏజెన్సీలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు, కడప, అనంతపురం డిపోల నుంచి సిలిండర్లు నిరంతరంగా సరఫరా అవుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
NDL: బుద్ధా రాజశేఖర్ రెడ్డిను నూతన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ P.V.S. నాయుడు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
W.G: యుద్ధం పేరుతో స్థానికంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీవీ ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తణుకులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ యుద్ధాలు వచ్చినప్పుడు కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు పురుషోత్తం(26), మణికంఠ(21) తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన వీరు, తమ సోదరిని చూసేందుకు బైకుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ELR: గిరిజన ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి తెలిపారు. రంపచోడవరం, సున్నిపేటలో ఈ పోటీలు జరుగుతాయి. ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2018 మధ్య జన్మించి, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులని ఆమె పేర్కొన్నారు.
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరు డివిఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం వాల్పోస్టర్ను డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత సమాజంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగబాబు, నార్కోటిక్ డీఎస్పీ రమేష్, ఉప సర్పంచ్ సురేష్, ఎస్సై నగేష్ కుమార్, పాల్గొన్నారు.