KNR: జమ్మికుంట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని సుమారు 28 ఏళ్ల యువకుడు ఆర్వోబీ సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.