W.G: యుద్ధం పేరుతో స్థానికంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీవీ ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తణుకులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ యుద్ధాలు వచ్చినప్పుడు కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.