KNR: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, హుజురాబాద్ మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 15, 2వ వార్డుల్లో, మున్సిపల్ పార్కులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురికి కాలువలు, చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు.