JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ లింబాద్రి అన్నారు. మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదరాన్ని తొలగించి చెత్త ఆటోలో తరలించారు.