BDK: దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అవసరమైన బియ్యం నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు.
KKD: పిఠాపురం పాదగయ జంక్షన్ వద్ద CI శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు గురించి అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
TPT: పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల ఎంపిక కోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కమిషనర్ డీ.వీ. నాగేశ్వరరావు తెలిపారు. భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వీల్చైర్లు, వాకర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేస్తారు.
టీనేజర్లు ఉదయాన్నే నిద్రకళ్లతో స్కూల్ వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వారి తప్పు కాదని, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే స్కూలు సమయం గంట ఆలస్యంగా మారడం వల్ల విద్యార్థులు రోజుకు అదనంగా 45ని. పాటు ఎక్కువ నిద్రపోగలిగారు. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, అలసట తగ్గి ఉత్సాహంగా కనిపించారు.
E.G: గోకవరం మండలం సూదికొండ గ్రామంలో 545 మంది రైతులకు గురువారం MLA జ్యోతులు నెహ్రూ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. కామరాజుపీట సర్పంచ్ బాబులు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. YCP హయాంలో భూముల మార్పిడే ధ్యేయంగా పాలన సాగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాజముద్ర, రైతు ఫోటోతో భద్రమైన పాసు పుస్తకాలు అందిస్తోందని తెలిపారు.
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో తన హవా కొనసాగిస్తోంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య రికార్డు స్థాయిలో 73.96 మిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లను నమోదు చేసింది. ఈ విషయంలో ఉబర్, ఓలాను ర్యాపిడో వెనక్కి నెట్టింది. ఉబర్ 39.05 మిలియన్ యాక్టివ్ యూజర్లు, ఓలా 28.15 మిలియన్ యాక్టివ్ యూజర్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.
NLG: ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్లో సెకండ్ లెవెల్లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామరచర్లలోని ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని సోమ శివాన్సిక జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. భారతీయ విద్యా భవన్లో బుధవారం పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని బీఆర్ఎస్ నేతలు వేణు, హరీశ్ ఆరోపించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ శివారులో కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు తన సొంత ఖర్చులతో పూర్తి చేయించారు. దీనితో గుర్రాలగొంది, గంగాపూర్ రైతుల పంట పొలాలకు సాగు నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ హరీశ్ రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
TG: గ్యాస్ ఏజెన్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘గ్యాస్ బ్లాక్ చేస్తే ఏజెన్సీలు రద్దు చేస్తాం. డొమెస్టిక్ గ్యాస్కు ఇబ్బంది లేదు. కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే కొరత ఉంది. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమవుతాం. డిమాండ్.. సప్లైపై ఆరా తీస్తాము. గ్యాస్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని సూచించారు.
సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ‘తీర్థవాది’ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీవారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా భృగుతీర్థానికి చేరుకోగా, అక్కడ వసంత వల్లభ స్వామికి ప్రత్యేక అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి కట్టిన కంకణాన్ని విప్పే ధ్వజావరోహణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
PPM: జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని సూచించారు. వడ గాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా చిన్నారులు, పశువుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
WGL: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ SC విభాగం రాష్ట్ర ఛైర్మన్గా ఇటీవల ఎన్నికైన మానకొండూరు MLA డా. కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీభవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో MLA KR నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
HYD: రైలులో ప్రయాణికుడి బ్యాగు చోరీపై కాచిగూడ రైల్వే పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన సురేశ్ పురి(37) కాచిగూడకు రావడానికి రాజస్థాన్లోని ఓ స్టేషన్లో రైలు ఎక్కాడు. రైలు నాందేడ్ వద్దకు రాగానే బ్యాగు కనిపించలేదన్నాడు. బ్యాగులో 10 గ్రాముల 2 బంగారు ఉంగరాలు, బట్టలు, ఆధార్ కార్డు ఉందన్నారు.
AKP: మహిళ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముందుగా ఘన వ్యర్థాల నిర్వహణపై వారికి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు అవగాహన కల్పించారు. అలాగే వారిని సత్కరించారు. పారిశుద్ధ్యం పరిశుభ్రతలో మహిళా కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు మెమొరాండం అందజేశారు. ఫిబ్రవరి 23, 2026 హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల సాగు భూమి, పింఛన్, ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని 16 మార్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.