MBNR: జిల్లా కేంద్రంలో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు మెమొరాండం అందజేశారు. ఫిబ్రవరి 23, 2026 హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల సాగు భూమి, పింఛన్, ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని 16 మార్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.