• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి’

KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా నేత భూక్యా వీరభద్రం బుధవారం డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.

February 18, 2026 / 05:44 PM IST

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు

కోనసీమ: అమలాపురంలోని APSRTC బస్ డిపో వద్ద ఏవి డ్రైవింగ్ స్కూల్ నందు 12వ బ్యాచ్‌కు సంబంధించిన 16 మంది అభ్యర్థులు 32 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు భాస్కర్ రావు, శర్మ, అధికారులు పాల్గొన్నారు.

February 18, 2026 / 05:33 PM IST

‘క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి అవసరం’

BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.

February 18, 2026 / 04:49 PM IST

తాడిచెర్లలో ఫిజికల్ ట్యాలెంట్ టెస్ట్

BHPL: తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ లో తాడిచెర్ల ఉన్నత పాఠశాలకు చెందిన బి. సిరిచందన, శైలాని, పి. వర్దిని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

February 18, 2026 / 03:55 PM IST