BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.