• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మర్రిపూడిలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని కూచిపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గుండ్ల సముద్రం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వసంత్ కుమార్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణితంలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహంగా నగదు బహుమతి ఇస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎంఈఓ రంగయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

March 12, 2026 / 06:56 PM IST

బడ్జెట్‌పై శాఖల వారీగా భట్టి సమీక్ష

TG: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తును ముమ్మరం చేస్తోంది. శాఖల వారీగా ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ-బడ్జెట్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, ప్రజా భద్రతకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.

March 12, 2026 / 06:56 PM IST

యుద్ధం ఎఫెక్ట్.. జిల్లాలో పెరిగిన గ్యాస్ బుకింగ్

WGL: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన ఉమ్మడి WGL జిల్లా ప్రజల్లో నెలకొంది. దీంతో వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేస్తున్నారు. సర్వర్లు కూడా తరచూ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ డోర్ డెలివరీకి వారం నుంచి 10 రోజుల సమయం పడుతోందని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.

March 12, 2026 / 06:54 PM IST

రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ

AKP: జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈనెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో51,269, మాడుగులలో 45,604, ఎలమంచిలి, 33, 648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15, 364 పాయకరావుపేటలో 39,302 మందికి వర్తిస్తుందన్నారు.

March 12, 2026 / 06:51 PM IST

సీఎం సహాయనిది పేదలకు ఒక వరం : ఎమ్మెల్యే

అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 35 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సుమారు ఐదున్నర కోట్ల రూపాయల మేర సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం అన్నారు.

March 12, 2026 / 06:50 PM IST

గ్రూప్-D పరీక్షలకు ఉచిత శిక్షణ

VZM: రైల్వే గ్రూప్-D 2026 ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9603557333 నంబరును సంప్రదించాలన్నారు. 

March 12, 2026 / 06:49 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి

శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న మన్నేన పుష్పలత ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి దంపతులు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈమేరకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమెతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

March 12, 2026 / 06:48 PM IST

మాచర్లలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

PLD: మాచర్లలో గురువారం వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

March 12, 2026 / 06:48 PM IST

‘వేసవిపై జాగ్రత్తలు పాటించాలి’

PPM: వేసవి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎన్‌సీడీ & ఆర్‌బీఎస్‌కే పీవో డా. టి. జగన్ మోహనరావు సూచించారు. అడ్డూరివలస ఆరోగ్య కేంద్రం, రావికోన ఆశ్రమ పాఠశాలను సందర్శించి మందుల లభ్యత, విద్యార్థుల ఆరోగ్య వివరాలను పరిశీలించారు. దీర్ఘకాలిక రోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.

March 12, 2026 / 06:48 PM IST

తూ.గో జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా పవన్ కుమార్

తూ.గో జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా రాజమండ్రి సిటీకి చెందిన పెరుమాళ్ళ పవన్ కుమార్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ భావజాలంతో నడిచే బీజేపీలో యువత కీలక పాత్ర వహించాలని, బలమైన భారత్‌ను నిర్మించాలనే సంకల్పంతో యువత దేశ ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు.

March 12, 2026 / 06:48 PM IST

త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల: చంద్రబాబు

AP: త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకుని పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

March 12, 2026 / 06:48 PM IST

IPL 2026: హాట్ ఫేవరెట్‌గా ముంబై..!

ఈ సీజన్‌లో పటిష్టమైన లైనప్‌తో MI బరిలోకి దిగుతోంది. రోహిత్, సూర్య, తిలక్, రికల్టన్, డికాక్, రూథర్‌ఫోర్డ్ వంటి బ్యాటర్లతో పాటు.. పాండ్యా, శాంట్నర్, విల్ జాక్స్, శార్ధుల్ వంటి ఆల్ రౌండర్లతో సమతూకంగా కనిపిస్తోంది. బుమ్రా, బోల్ట్, దీపక్ చాహార్‌లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. MI జట్టును చూస్తుంటే ఈసారి ఆరో టైటిల్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

March 12, 2026 / 06:48 PM IST

మల్లేపల్లిలో 60 గ్యాస్ సిలిండర్లు సీజ్

NLG: మల్లేపల్లిలో వాణిజ్య అవసరాలకు వాడుతున్న 60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరా అధికారులు సీజ్ చేశారు. హోటళ్లు, దాబాలపై దాడులు నిర్వహించి 6A కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్.డి. ముబీన్, ఎండీ ముక్తార్, ఏ. దీపక్, ఆర్. సైదులు గౌడ్, జ్యోతి, ఏ. సైదులు, కుమార్ రెడ్డి మరియు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

March 12, 2026 / 06:47 PM IST

పాము కాటుతో వ్యక్తి మృతి

MDK: జొన్న పంటకు నీరు పెడుతుండగా పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన కర్ణకోటి రాములు(55) గురువారం భార్యతో కలిసి పొలానికి నీరు పెడుతుండగా నాగుపాము కాటేసింది. మొదటి కాటు తర్వాత భార్యను పిలిచేలోపే అదే పాము మరోసారి కాటేసినట్లు సమాచారం. వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాములు మృతిచెందాడు.

March 12, 2026 / 06:45 PM IST

పోక్సో కేసు నిందితుడికి జైలు శిక్ష

VZM: 2024 గరివిడి పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో బాల నేరస్థుడుకి పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్పీ గురువారం తెలిపారు. రూ. 12 వేలు జరిమానా, పరిహారం రూ. 5 లక్షలు ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు. బొప్పడాం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు చెప్పారు.

March 12, 2026 / 06:43 PM IST