• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మడకశిరలో 28న వేలం పాట

సత్యసాయి: మడకశిర నగర పంచాయతీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కూరగాయల మార్కెట్, వారపు సంత, బస్టాండ్ పార్కింగ్ సుంకం వసూళ్లకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఎవరూ పాల్గొనకపోవడంతో మున్సిపల్ కమిషనర్ రంగస్వామి తిరిగి ఈ వేలాన్ని ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

February 21, 2025 / 04:20 AM IST

రీసర్వేను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్

NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను గురువారం జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో హద్దులు ఏర్పరచి రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టు ద్వారా ముదివర్తిపాలెం ఎంపికైందని తెలిపారు.

February 21, 2025 / 04:18 AM IST

వేమిరెడ్డి దంపతులతో డిప్యూటీ మేయర్ భేటీ

నెల్లూరు డిప్యూటి మేయర్‌గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ మాగుంట లే అవుట్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. వేమిరెడ్డి దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీస్సులందుకున్నారు. డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటి మేయర్ సయ్యద్ తహసీన్ భర్త ఎస్.ఆర్. ఇంతియాజ్ వేమిరెడ్డి దంపతులను కలిసి సత్కరించారు.

February 21, 2025 / 04:14 AM IST

21న సబ్సిడీ లోన్లకు ఇంటర్వ్యూలు

NLR: బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు చేజర్ల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి విజయ లలిత ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ నెల21వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

February 21, 2025 / 04:04 AM IST

జగన్‌కు మంత్రి సవిత సవాల్

సత్యసాయి: మిర్చి రైతుల సమస్యలపై దమ్ముంటే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్ విసిరారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మిర్చి రైతులకు మేలు జరిగిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు జగన్ హాజరుకావాలని డిమాండ్ చేశారు.

February 21, 2025 / 04:03 AM IST

పామూరు మండల వైసీపీ అధ్యక్షునిగా హుస్సేన్ రెడ్డి

ప్రకాశం: పామూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా గంగసాని హుస్సేన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరక వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్ రెడ్డి సతీమణి గంగసాని లక్ష్మి పామూరు ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల హుస్సేన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2025 / 04:02 AM IST

‘చెరువులకు కృష్ణా జలాల నింపండి’

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల ద్వారా 193చెరువులు, 2రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపాలని మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. గురువారం సచివాలయంలో మంత్రిని కలిసిన ఆయన, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని తెలిపారు. వీటి పెంపుదల కోసం తగిన నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2025 / 04:02 AM IST

సీఎస్ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

NLR: రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు.

February 21, 2025 / 04:00 AM IST

పెరుగు తింటున్నారా..?

పెరుగు తింటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక.. వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి కుడివైపున వచ్చే పెద్ద పేగు క్యాన్సర్‌.. ముప్పు తగ్గుతున్నట్టు వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్‌ కన్నా కుడి వైపు క్యాన్సర్‌ తీవ్రమైంది కావటం గమనార్హం.

February 20, 2025 / 08:28 PM IST

IND vs BAN: గిల్ హాఫ్ సెంచరీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 50* పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో వరుసగా 4వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 87, 60, 112 పరుగులు సాధించాడు.

February 20, 2025 / 08:27 PM IST

‘ఎలుకల నివారణపై అవగాహన కార్యక్రమం’

W.G: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడితే వరి చేలలో ఎలుకలు పూర్తిగా నివారించుకోవచ్చని మొగల్తూరు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రహీం అన్నారు. గురువారం ఆయన మొగల్తూరు గ్రామంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రైతులు సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరి రైతులు పాల్గొన్నారు. అనంతరం వరి పంట సస్యరక్షణపై అవగాహన కల్పించారు.

February 20, 2025 / 08:22 PM IST

రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే కేసులు

NZB: రోడ్లపై ధాన్యాలు ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి హెచ్చరించారు. ఎర్ర జొన్న కోతలు అవుతున్న నేపథ్యంలో రోడ్లపై ధాన్యాన్ని ఆరవేయొద్దని సూచించారు. దాన్ని అన్ని రోడ్లపై ఆరేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సూచించారు. గ్రామ రోడ్లపై, జాతీయ రహదారులపై ధాన్యాన్ని ఆరబోస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూచించారు.

February 20, 2025 / 08:17 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గురువారం ఆయన ఆయన కార్యాలయంలో ఐదు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

February 20, 2025 / 08:15 PM IST

‘వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి’

ప్రకాశం: గిద్దలూరులో గురువారం పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 2 వేల కోట్లు కేటాయించాలని ప్రజాసంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ నివాసాలు భూములు కోల్పోతున్న ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

February 20, 2025 / 08:14 PM IST

నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

W.G: ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఈవో రంగరాజు అన్నారు. గురువారం యలమంచిలి మండలంలోని కొంతేరు హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25వరకు జరిగే ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2025 / 07:57 PM IST