• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి’

MHBD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా ప్రజా ప్రతినిధులకు శిక్షణ నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే మురళీనాయక్, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 06:33 PM IST

‘మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం’

NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని జడ్పీ కార్యాలయంలో ”ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.

March 12, 2026 / 06:33 PM IST

తాడ్కోల్ పంచాయతీ పాలకవర్గం సమావేశం

KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో నీటి ఎద్దడి ఉన్న కాలనీలను గుర్తించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని, ఎర్రమ్మ కుచ్చలో కొత్త మురికి కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

March 12, 2026 / 06:33 PM IST

ప్రజా ప్రతినిధులకు 99 రోజుల ప్రణాళికపై శిక్షణ

ASF: జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణపై స్థానిక ప్రజా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొని, క్షేత్రస్థాయి అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు.

March 12, 2026 / 06:32 PM IST

వ్యాక్సిన్ & మెడిసిన్ మధ్య తేడా ఇదే..!

వ్యాధి రాకుండా ముందుగా వేసుకునేది వ్యాక్సిన్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌లతో పోరాడుతుంది. అదే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత నయం చేయడానికి వాడేవి మందులు. టీకాలను వైరస్ లేదా బ్యాక్టీరియా జన్యువుల నుంచి తయారు చేస్తారు. మెడిసిన్స్‌ను రసాయనాలతో రూపొందిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యాక్సిన్ నిరోధిస్తుంది, మెడిసిన్ చికిత్స చేస్తుంది.

March 12, 2026 / 06:32 PM IST

‘విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి’

ADB: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని, అర్థమయ్యే రీతిలో భోదించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ అన్నారు. గురువారం నార్నూర్ మండలం గిరిజన ఆశ్రమ పాఠశాల మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగారు.

March 12, 2026 / 06:31 PM IST

వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ MLA సుధీర్రెడ్డి దూరం

KDP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. అయితే ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ఎక్కడ పాల్గొనలేదు. దీంతో సుధీర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

March 12, 2026 / 06:30 PM IST

రైల్వే అభ్యర్థులకు శుభవార్త

అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్-డీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంచాలకులు కొఠారి గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి 2 నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

March 12, 2026 / 06:30 PM IST

సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే కేయి

KNRL: పత్తికొండలో గురువారం జరిగిన కార్యక్రమంలో శ్యామ కుమార్ 77 మంది లబ్ధిదారులకు రూ.49 లక్షల 70 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఆధారంగా ప్రభుత్వం నిధులు అందజేస్తోందని పేర్కొంటూ లబ్ధిదారులు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 06:30 PM IST

బయో-ఫోర్టిఫికేషన్ పద్ధతులను అవలంబించాలి: శాస్త్రవేత్త

W.G: పోషకాహార లోపాన్ని నివారించేందుకు క్యారెట్, పాలకూర వంటి వాటిలో బయో- ఫోర్టిఫికేషన్ పద్ధతులను అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం(M) వెంకట రామన్నగూడెం డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో దిగుబడి, నాణ్యత, తెగుళ్ల నిరోధకత, కూరగాయల పంటలో ఆధునిక పద్ధతులు అనే అంశంపై వెబినార్ నిర్వహించారు.

March 12, 2026 / 06:30 PM IST

సోమందేపల్లి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారపు సంతలో మార్పు చేశారు. వచ్చే గురువారం ఉగాది పండుగ సందర్భంగా వారపు సంతను బుధవారం నిర్వహిస్తున్నట్లు సంత గుత్తేదారు హరికృష్ణ తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు ఈ మార్పును గమనించి బుధవారం జరిగే సంతలో తమ వ్యాపారాలను నిర్వహించాలని ఆయన సూచించారు. సంతకు వచ్చే వారంతా సహకరించాలని కోరారు.

March 12, 2026 / 06:30 PM IST

లిఫ్ట్ అడిగి గోల్డ్ చైన్ చోరీ

KNR: తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకుని వస్తుండగా, జెన్‌కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు.

March 12, 2026 / 06:30 PM IST

పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు: ఎమ్మెల్యే

WNP: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే కడవరకు పని పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన మండల, పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, DCC అధ్యక్షుడు శివసేనరెడ్డితో కలిసి పాల్గొన్నారు.

March 12, 2026 / 06:29 PM IST

‘పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి’

JGL: కోరుట్ల పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.

March 12, 2026 / 06:28 PM IST

వనపర్తి డిపోకు రూ.10 కోట్ల ఆదాయం: ఎమ్మెల్యే

WNP: కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు.

March 12, 2026 / 06:27 PM IST