NZB: నవీపేట మండలం అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పక్క సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా మల్కాపూర్ పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
CTR: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని టీడీపీ నాయకులు సి.వి.రెడ్డి, గిరిబాబు ఆకాంక్షించారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 74 మందికి విద్యార్థినులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
KMR: దేశంలో ఢల్లీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని మాజీ MP BB పాటిల్ అన్నారు. నేడు MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రశ్నించడానికి బీజేపీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
CTR: బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా, కార్యక్రమానికి ఆదితోపాటు మరో నటుడు రాంప్రసాద్ సైతం రానున్నారు.
KMR: జిల్లా కేంద్రంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ జిల్లా సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామ్రేడ్ పాలడుగు సుధాకర్ హాజారయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పేదలకు, కార్మిక వర్గానికి ఎలాంటి కేటాయింపులు దక్కలేదన్నారు.
KMR: పిట్లం మండలంలోని తిమ్మా నగర్, మార్దండ, కంబాపూర్ గ్రామాలలోని నర్సరీలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్లను ఇవాళ పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శిలకు పలు సూచనలు చేశారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
KMR: జిల్లాలోని దేవునిపల్లి పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిన్న పిల్లలు ఉన్నారు.
TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు అందిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడ్డారు. చిన్నారుల తల్లి, తండ్రులు తక్షణమే తమ పిల్లలను స్వయంగా మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చించనున్నారు. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతారు.
PPM: వీరఘట్టం పంచాయతీ కార్యాలయం వద్ద ఓమిగో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాన్సర్ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. క్యాన్సర్ను ప్రాథమిక దశల్లో గుర్తించడం ద్వారా కాపాడుకోవచ్చని అన్నారు.
NGKL: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, తదితర సమస్యలపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా పేరెంట్స్ జాగ్రత్త వహించాలన్నారు.
VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ని తొలగించి వాటిని రోడ్డు రోలర్తో ధ్వంసం చేశామన్నారు.
WGL: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్తోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పీడీఎస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. గతంలో రవాణాకు పాల్పడిన వారితోపాటు ప్రస్తుతం రవాణాకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని సేకరించి రేషన్ బియ్యం రవాణా కట్టడి చేశారు.