CTR: అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడమే లక్ష్యంగా ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చిత్తూరు క్రైమ్ పోలీస్ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. పీవీకేఎన్ కాలేజీలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, వేధింపులు, డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులకు వివరించారు.