KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం ఆలయానికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడవీధులు, విశ్రాంతిభవనం, కళ్యాణ వేదిక, నిత్యాన్నదానం కేంద్రంలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారన్నారు.