• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు గూడూరులో జాబ్ మేళా

TPT: గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 20, 2025 / 11:14 AM IST

త్వరలో సహాయ ఉపకరణాలు పంపిణీ

MNCL: దివ్యాంగులకు త్వరలో సహాయ ఉపకారణాలను పంపిణీ చేయనున్నామని వైద్య అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. వారి సదరం సర్టిఫికెట్లను వైద్యులు పరిశీలించారు.

February 20, 2025 / 11:12 AM IST

కురవి ఆలయంలో హీరో గోపీచంద్ పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని ప్రముఖ సిని హీరో గోపిచంద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గోపిచంద్‌కు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, దర్మకర్త చిన్నం గణేష్‌లు అందజేశారు. కాగా, ఆయన అభిమానులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.

February 20, 2025 / 11:06 AM IST

గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

February 20, 2025 / 11:01 AM IST

కాణిపాకం ఆలయానికి విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.

February 20, 2025 / 10:47 AM IST

శునకాలకు కుటుంబ నియంత్రణకు చర్యలు

CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.

February 20, 2025 / 10:43 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

ప్రజల భద్రత వారి చేతుల్లోనే: ఎస్సై

CTR: ప్రజల ఇంటి భద్రత ఇప్పుడు వారి చేతిల్లోనే ఉందని కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. రూ.2000లకు కూడా కెమెరాలు అందుబాటులో వున్నాయని ఎవరైనా సీసీ కెమెరాలు అమర్చుకోవాంటే తమను సంప్రదించాలని కోరారు.

February 20, 2025 / 10:30 AM IST

క్రీడా ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులు ప్రారంభం

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఆర్ కిషోర్ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల మందికి ఆరోగ్యాన్నిస్తున్న క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2025 / 09:18 AM IST

ఒంటరితనం భయంకరంగా ఉంటుంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని తెలిపింది. అయితే, మౌనంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని చెప్పుకొచ్చింది. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా మూడు రోజులు ధ్యానంలో ఉంటానంటూ పోస్ట్ పెట్టింది.

February 20, 2025 / 08:28 AM IST

వక్ఫ్ బోర్డు సీఈఓకు ఫిర్యాదు

WGL: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓని పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. అన్నారం దర్గా వద్ద తలనీలాలను రెండేళ్లుగా టెండర్ వేయకుండా వెంట్రుకలు పోగుచేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తలనీలాలు అమ్ముకొని, వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.

February 20, 2025 / 08:18 AM IST

నేడు మాల కార్పొరేషన్ ఛైర్మన్ రాక

KDP: ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ గురువారం కడపలో అందుబాటులో ఉంటారని ఈడీ రాజ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి ఎస్సీ నాయకులతో ముఖామఖి నిర్వహిస్తారని, అనంతరం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమవుతారని తెలిపారు.

February 20, 2025 / 07:59 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 20, 2025 / 07:55 AM IST

‘పేదల బడ్జెట్ కాదు కార్పొరేటర్ల బడ్జెట్’

TPT: పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరేటర్ బడ్జెట్ అన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడేలా లేదని ఆయన డిమాండ్ చేశారు.

February 20, 2025 / 07:42 AM IST

శ్రీకాకుళంలో వారిపై రౌడీషీట్స్..!

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువయ్యాయి. ఇటీవల విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు గంజాయి వినియోగించే వారిపై సైతం రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు.

February 20, 2025 / 07:24 AM IST