• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాణిపాకం ఆలయానికి విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.

February 20, 2025 / 10:47 AM IST

శునకాలకు కుటుంబ నియంత్రణకు చర్యలు

CTR: చిత్తూరు మున్సిపల్ షెడ్డులో నూతనంగా నిర్మించిన శునకాల కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జిల్లాలో 7వేల శునకాలు ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ చేయడమే లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రక్రియకు తిరుపతికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం చిత్తూరులోని కేంద్రం ప్రారంభించామన్నారు.

February 20, 2025 / 10:43 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

ప్రజల భద్రత వారి చేతుల్లోనే: ఎస్సై

CTR: ప్రజల ఇంటి భద్రత ఇప్పుడు వారి చేతిల్లోనే ఉందని కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. రూ.2000లకు కూడా కెమెరాలు అందుబాటులో వున్నాయని ఎవరైనా సీసీ కెమెరాలు అమర్చుకోవాంటే తమను సంప్రదించాలని కోరారు.

February 20, 2025 / 10:30 AM IST

క్రీడా ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులు ప్రారంభం

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఆర్ కిషోర్ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వందల మందికి ఆరోగ్యాన్నిస్తున్న క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2025 / 09:18 AM IST

ఒంటరితనం భయంకరంగా ఉంటుంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని తెలిపింది. అయితే, మౌనంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని చెప్పుకొచ్చింది. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా మూడు రోజులు ధ్యానంలో ఉంటానంటూ పోస్ట్ పెట్టింది.

February 20, 2025 / 08:28 AM IST

వక్ఫ్ బోర్డు సీఈఓకు ఫిర్యాదు

WGL: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓని పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. అన్నారం దర్గా వద్ద తలనీలాలను రెండేళ్లుగా టెండర్ వేయకుండా వెంట్రుకలు పోగుచేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తలనీలాలు అమ్ముకొని, వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.

February 20, 2025 / 08:18 AM IST

నేడు మాల కార్పొరేషన్ ఛైర్మన్ రాక

KDP: ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ గురువారం కడపలో అందుబాటులో ఉంటారని ఈడీ రాజ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి ఎస్సీ నాయకులతో ముఖామఖి నిర్వహిస్తారని, అనంతరం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమవుతారని తెలిపారు.

February 20, 2025 / 07:59 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 20, 2025 / 07:55 AM IST

‘పేదల బడ్జెట్ కాదు కార్పొరేటర్ల బడ్జెట్’

TPT: పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరేటర్ బడ్జెట్ అన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడేలా లేదని ఆయన డిమాండ్ చేశారు.

February 20, 2025 / 07:42 AM IST

శ్రీకాకుళంలో వారిపై రౌడీషీట్స్..!

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువయ్యాయి. ఇటీవల విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు గంజాయి వినియోగించే వారిపై సైతం రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు.

February 20, 2025 / 07:24 AM IST

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న అజయ్ జైన్

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ దర్శించుకున్నారు. ఆలమ మర్యాదలతో స్వాగతం పలికి, రామాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేద తీరిన ఆయనకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేసి, ఘనంగా సత్కరించారు.

February 20, 2025 / 07:19 AM IST

21ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్: తొలగించిన వైద్యులు

KNR: కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 21 ఏళ్లుగా ఊపిరితిత్తులలో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్ విజయవంతంగా తొలగించారు. కరీంనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు 5 ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి ఏ ఇబ్బంది లేదన్నారు. 10 రోజులుగా అతను అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు CT స్కాన్ చేసి హెలిక్యాప్ గుర్తించి వెలికి తీశారు.

February 20, 2025 / 07:18 AM IST

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ

కృష్ణా: ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఘంటసాలలోని మహాత్మాగాంధీ జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ స్వాతి బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.

February 20, 2025 / 04:12 AM IST

ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశాలు

NTR: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ మన్నే సుధీర్ సస్పెన్షన్‌కు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతనదారులకు పనులు కల్పించడంలోనూ సగటు వేతనం విషయంలో, అనుమతి లేకుండా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.

February 20, 2025 / 04:08 AM IST