కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఈ నెల 14వ తేదీన షటిల్ టోర్నమెంట్ ప్రారంభించనున్నట్లు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7,500, తృతీయ బహుమతి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.