AP: విశాఖకు డేటా సెంటర్లు తీసుకొచ్చిందే జగన్ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములు కాపాడాలనే గురుమూర్తి పిల్ చేశారు. విశాఖ భూదోపిడీపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం. ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. భూ కేటాయింపులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.