BDK: ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామంలో ఆదివాసీలు గడ్డి కోమరాజు జాతర నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసి సంస్కృతి సంప్రదాయం తో కూడిన నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. జాతరలు నిర్వహించడం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగం అని తెలిపారు.