• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమృత్ భారత్ రైలుకు రాజమండ్రిలో హాల్ట్

E.G: చర్లపల్లి – కామాఖ్య అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తూ. గో జిల్లాకి కనెక్టివిటీ కలుగుతోంది. ఈ రైలు రేపటి నుంచి రాజమండ్రిలో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ వంటి ప్రధాన నగరాలు అనుసంధానం అవుతున్నాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరుగనుంది.

March 12, 2026 / 07:50 PM IST

ఒంగోలు డిపోలో డ్రైవింగ్ శిక్షణ

ప్రకాశం: ఒంగోలు డిపోలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, శిక్షణకు ఫీజు రూ. 20,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 16వ తేదీ లోపు డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.

March 12, 2026 / 07:50 PM IST

TGPSC.. కీలక అప్డేట్

TG: TGPSC నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అనేది అత్యంత ముఖ్యమైనది. TGPSC తాజాగా ఒక కొత్త సంస్కరణను తీసుకువచ్చింది. ఇకపై అభ్యర్థులు ఏడాదికి రెండుసార్లు మాత్రమే తమ OTRను అప్‌డేట్ చేసుకునే వీలుకల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో సుమారు 10 రోజుల పాటు ఈ విండో అందుబాటులో ఉంటుంది.

March 12, 2026 / 07:49 PM IST

అడ్లూరికి నేనే మంత్రి పదవి ఇప్పించా: MLA

TG: MLA మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి తానే ఇప్పించానని పేర్కొన్నారు. SC ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత తనదేనని అన్నారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. మందుల సామేల్ వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని స్పష్టం చేశారు. SCల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు.

March 12, 2026 / 07:48 PM IST

ఆసుపత్రి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

కృష్ణా: కంకిపాడు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 5.75 కోట్లతో నిర్మించబోయే అదనపు గదులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పెనమలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించిన దాతలు అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 07:46 PM IST

‘గ్యాస్ అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటాం’

BDK: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, గ్యాస్ సిలిండలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, పౌరసరఫరాల శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

March 12, 2026 / 07:46 PM IST

రేపటి నుంచి ఉద్యానవర్సిటీలో స్పోర్ట్స్ మీట్

W.G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు 12వ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని 5 ప్రభుత్వ, 3 ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు.

March 12, 2026 / 07:45 PM IST

పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: ఎంఈవో

PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. ఇవాళ ఆయన పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. మండలంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

March 12, 2026 / 07:43 PM IST

10వ తరగతి విద్యార్థులకు భరోసా కల్పించిన నాయకుడు

KMM: శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న పదవ తరగతి విద్యార్థులకు అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్ విద్యార్థులకు లేఖలు రాశారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో పలు పాఠశాలలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వాళ్లలో మనోధైర్యాన్ని నింపారు.

March 12, 2026 / 07:43 PM IST

‘లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి’

KMM: మధిరలో ఈ నెల 28 న జరగనున్న మొదటి మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు న్యాయమూర్తి వేముల దీప్తి కోరారు. గురువారం స్థానిక ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పని పనిచేయాలన్నారు.

March 12, 2026 / 07:42 PM IST

ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

MHBD: జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పరిధిలోని సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్మన్‌లు, కౌన్సిలర్‌ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్, MLC తక్కెళ్ళపల్లి రవీందర్, మానుకోట MLA భూక్యా మురళీనాయక్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని వారు సూచించారు.

March 12, 2026 / 07:41 PM IST

బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి

NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి, ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానికులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 07:40 PM IST

కొత్త ఇళ్లు కట్టి ఇవ్వండి.. ఉన్న ఇళ్లు కూల్చొద్దు: మాజీ మంత్రి

MBNR: అధికార కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కొత్త ఇళ్లు కట్టి ఇవ్వాలని ఉన్న ఇళ్లను కూల్చకూడదని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాధితులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం బాధితులకు ఇచ్చినట్టుగా ఆదర్శనగర్ బాధితులకు ఇళ్లు ఇవ్వాలన్నారు.

March 12, 2026 / 07:40 PM IST

విద్యుత్ శాఖ పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష

WNP: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం అధికారులతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

March 12, 2026 / 07:40 PM IST

‘లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి’ న్యాయవాదుల మద్దతు

ATP: ఆర్డీటీ సంస్థకు FCRA రిజిస్ట్రేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ‘లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి’ కళ్యాణదుర్గం న్యాయవాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దశాబ్దాలుగా పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థకు నిధుల ఇబ్బంది కలగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని రంగయ్య కోరారు.

March 12, 2026 / 07:40 PM IST