• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాములోరి కళ్యాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

WNP: శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి రూ.2,00,000 విరాళం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలతో పాటు, కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 08:13 AM IST

జన గణనకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు

నల్లగొండ జిల్లాలో జనగణన కోసం అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో మొత్తం 34,88,809. పురుషులు 17,58,772, మహిళలు 17,29,037. తాజా గణనలో సుమారు 16,18,416 కుటుంబాల వివరాలు సేకరించడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో 8,18,306, పట్టణాల్లో 8,00,110 కుటుంబాల నుంచి సమాచారం నమోదు చేయనున్నారు.

March 15, 2026 / 08:13 AM IST

బంట్వారంలో వీధి కుక్కల బెడద

VKB: బంట్వారంలో వీధి కుక్కల దాడులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో ప్రజలకు నిద్రలేకుండా పోతోందని వాపోతున్నారు. గతంలో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 15, 2026 / 08:11 AM IST

IPL ‘పర్పుల్ క్యాప్’ విన్నర్లు వీరే

అత్యధిక వికెట్లు తీసినందుకుగాను అత్యధికంగా 2 సార్లు IPL పర్పుల్ క్యాప్ అందుకున్న ప్లేయర్లుగా హర్షల్ పటేల్(2021 & 24), డ్వేన్ బ్రావో(2013 & 15), భువనేశ్వర్(2016 & 17) నిలిచారు. తొలి క్యాప్(2008) గెలిచిన ఘనత పాక్ ప్లేయర్ సోహైల్ తన్వీర్(RR)కే దక్కింది. RP సింగ్, ఓజా, మలింగ, మోర్కెల్, మోహిత్, ఆండ్రూ టై, తాహీర్, రబాడ, చాహల్, షమీ, ప్రసిద్ధ్ కృష్ణ తలోసారి అందుకున్నారు.

March 15, 2026 / 08:10 AM IST

‘రోలుగుంటలో నేడు ఉల్లాస్ కార్యక్రమం’

AKP: రోలుగుంట మండలంలో ఆదివారం ‘ఉల్లాస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విఎస్.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 4,014 మంది వయోజనులను గుర్తించి 24 పంచాయతీల్లో కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ, అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని అయన వెల్లడించారు.

March 15, 2026 / 08:08 AM IST

చికెన్ ధరకు రెక్కలు.. కిలో ధర ఎంతంటే?

కోనసీమ: జిల్లాలో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. అమలాపురం మార్కెట్‌లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300, ఫారం మాంసం కిలో రూ.240 అమ్ముతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. మటన్ కిలో రూ.800కి అమ్ముతున్నారు. చేపల రకాన్ని బట్టి రూ.130 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. కోళ్లు సరఫరా తగ్గడం వల్ల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారస్తులు అంటున్నారు.

March 15, 2026 / 08:07 AM IST

శ్రీవారి దర్శనానికి 21 గంటల సమయం

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 21 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి నారాయణగిరి షెడ్డులలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 38,855 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.6 కోట్లుగా నమోదైంది.

March 15, 2026 / 08:06 AM IST

పోలీసులకు ప్రజలు సహకరించాలి: ఎస్ఐ

KKD: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో శనివారం రాత్రి పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని SI మూర్తి కోరారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

March 15, 2026 / 08:05 AM IST

నల్గొండలో భగ్గుమంటున్న చికెన్‌ ధర!

నల్గొండ జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రస్డ్ చికెన్ రూ.286 నుంచి రూ.290 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ.325 వరకు పలుకుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

March 15, 2026 / 08:05 AM IST

జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రజల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు చేసి, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు.

March 15, 2026 / 08:04 AM IST

ఘనంగా గుత్తికోట ఉత్సవాలు

ATP: కర్ణాటకలోని హంపిలో జరిగే ఉత్సవాల లాగా గుత్తి కోట ఉత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి కోట ఉత్సవాల గురించి మన జిల్లా ఎంపీ లక్ష్మీనారాయణ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడారని వారు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గుత్తి కోట చరిత్ర తెలిపేందుకు ఇలాంటి ఉత్సవాలు మరెన్నో జరగాలన్నారు.

March 15, 2026 / 08:04 AM IST

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని DLNR పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదివి ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు దాతల సహకారంతో ప్రోత్సాహకాలు అందజేశారు. ఒక్కొక్క విద్యార్థికి 5000 చొప్పున 10 మంది విద్యార్థులకు 50 వేల రూపాయలు అందజేశారు. చదువుతోనే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

March 15, 2026 / 08:03 AM IST

జిల్లా జైలు పెట్రోల్ పంపులో ఆయిల్స్ మేళా

ADB: జిల్లా జైలు పెట్రోల్ బంక్ రెండో వార్షికోత్సవం సందర్భంగా జైలు పర్యవేక్షకుడు గోపిరెడ్డి ‘ఆయిల్స్ మేళా మల్టీ గ్రేడ్’ను ప్రారంభించారు. ఈ మేళాలో ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గ్రీస్ వంటి ఉత్పత్తులపై 25% రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 15, 2026 / 08:03 AM IST

నేడు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు

TG: రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజాన్ ఇఫ్తార్ విందు ఇవాళ HYDలోని LB స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోసహా పలువురు మంత్రులు హాజరై, ముస్లింలతో కలిసి విందులో పాల్గొననున్నారు. ఈ వేడుకను పురస్కరించుకుని ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వేలాది మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది.

March 15, 2026 / 08:03 AM IST

జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..?

కడప జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.278, స్కిన్‌లెస్ చికెన్ రూ.317, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1,000కు అమ్ముతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

March 15, 2026 / 08:02 AM IST