VKB: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నర్సింగ్ రావు తెలిపారు. మూడు కేంద్రాల్లో మొత్తం 568 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జడ్పీ బాలుర పాఠశాల (200 మంది), బాలికల పాఠశాల (188), మంబాపూర్ పాఠశాల (180) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన పేర్కొన్నారు.
SRCL: యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు కోరారు. మర్తన్నపేట మార్గదర్శి స్కూల్ విద్యార్థులు కోనరావుపేట మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్లే కార్డ్స్ ర్యాలీ నాటకాలు డ్యాన్స్ ద్వారా ప్రజలకు మత్తుపదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కష్టపడినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
SDPT: ప్రజాప్రతినిధులు ప్రజాసేవే లక్ష్యంగా మెరుగైన సేవలు అందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ హైమావతి అధ్యక్షతన జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాటిని అర్హులైన ప్రజలకు చేరాలన్నారు.
JGL: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాయికల్ మండలంలోని అల్లిపూర్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం పొరండ్ల కిరణ్, పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అండర్-14 విభాగంలో 60 మీటర్ల పరుగులో మణితేజ, అండర్-20 విభాగంలో విశ్వేశ్ ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈనెల 15న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారన్నారు.
VZM: శత శాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులకు భోగాపురం డిప్యూటీ MPDO గాయత్రి సూచించారు. గురువారం ముంజేరు గ్రామ పంచాయతీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించి, ఇళ్ల పన్నులు ఎంత మేరకు వసూలు జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల యొక్క అసెస్మెంట్ నంబర్లు ఎంత మేరకు వేసారంటూ ఆరా తీశారు.
GDWL: జోగులాంబ అమ్మవారి ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ అధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న సొమ్ము రూ. 99,55,566 వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. స్వామివారి హుండీని పండుగ తర్వాత లెక్కిస్తామని ఆయన పేర్కొన్నారు.
BHNG: నిధుల కేటాయింపులో పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారంట ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ సర్పంచులు నిలదీశారు. భువనగిరిలో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం రసాభాసగా జరిగింది. గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
KRNL: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చే వెబ్సైట్ లింక్లపై క్లిక్ చేయవద్దని మంత్రాలయం ఎస్సై మల్లికార్జున పిలుపునిచ్చారు. మండలంలోని బూదూరులో సీఐ రామానుజులు ఆదేశాల మేరకు ఆయన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.
NZB:ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నేర ఆంధ్రయ్య తెలిపారు. కమ్మర్ పల్లి మండలంలోని 4 కేంద్రాల్లో మొత్తం 478 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
MBNR: జిల్లా గండీడ్ మండల ఎంఆర్ బ్రహ్మరౌతు మల్లికార్జునరావు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నారు. వెన్నచెడ్ గ్రామంలో జనవరి 27న నిర్వహించిన ‘నో డ్రగ్స్ అవేర్నెస్’ కార్యక్రమంలో భాగంగా 2500 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ, 77 మంది పిల్లల వేషధారణ, 77 బైక్ ర్యాలీల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు.
కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను పటిష్ఠ భద్రతల మధ్య నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా బాలురు 6,451 బాలికలు 6,703 మంది ఉన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9గం. నుంచి 12.30గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి.
NDL: నిబంధనలకు విరుద్ధంగా, మద్యం తాగి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు. గురువారం రాత్రి గాజులపల్లె పరిధిలోని మెట్ట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందికి జరిమానాలు విధించారు. రోడ్డు నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
KDP: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని శ్రీ గోవింద మాంబ అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవం శుక్రవారం బ్రహ్మంగారి మఠంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి తెలిపారు. ప్రభాతసేవ, పంచామృతాభి షేకం, ద్వారపూజ, గ్రామోత్సవం పలు కార్యక్ర మాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు.
HYD: ఖైరతాబాద్ RTA కార్యాలయం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో నంబర్ల కోసం వాహనదారులు భారీగా పోటీ పడ్డారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.31,14,730 ఆదాయం లభించింది. ఈ మేరకు TG 09 L 0009 ఈ నంబర్ అత్యధిక ధర పలికింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఏకంగా రూ.10,50,000 వెచ్చించి దీనిని దక్కించుకుంది.
NLG: కేతెపల్లి మండల కేంద్రం ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. HYD వెళ్లే, తిరిగి వచ్చే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులకు కేతెపల్లిలో హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి పెండింగ్లో ఉన్న ఈ సమస్య కు ఎట్టకేలకు తాజాగా పరిష్కారం లభించింది. రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.