• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

CTR: పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, పెద్దలు, మహిళలు జై భవాని, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 19, 2025 / 05:01 PM IST

‘సర్వేను వేగవంతం చేయాలి’

కోనసీమ: భూముల పునః సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మార్చి నెలాఖరుకి గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

February 19, 2025 / 05:00 PM IST

నంద్యాల సభకు పుంగనూరు నుంచి ఉచిత బస్సులు

CTR: SDPI పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో రేపు (గురువారం) జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పార్టీ జిల్లా నాయకుడు యూసుఫ్ తెలిపారు. ఇవాళ పుంగనూరులో ఆయన మాట్లాడుతూ ‘వక్ఫ్ రక్షణ సమాజ సంక్షేమం’ అనే నినాదంతో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పుంగనూరు నుండి వెళ్లేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 19, 2025 / 05:00 PM IST

రేపు సబ్సిడీ లోన్లకు ఇంటర్వ్యూలు కార్యక్రమం

NLR: బీసీ, కాపు, ఈ బీసీ, తదితర కార్పొరేషన్ల నుండి సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ విడవలూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సబ్సిడీ లోన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంబంధిత సర్టిఫికెట్లతో ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

February 19, 2025 / 04:58 PM IST

రాజశేఖర్‌కి మద్దతుగా టీడీపీ నాయకులు ప్రచారం

కోనసీమ: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ మద్దతుగా అమలాపురంలో టీడీపీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు

February 19, 2025 / 04:57 PM IST

‘ప్రభుత్వానికి విక్రయించి గిట్టుబాటు ధర పొందండి’

NLR: వెంకటాచలం మండలం చవటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

February 19, 2025 / 04:56 PM IST

‘తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి’

NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. జిల్లాలో వందలకు పైగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని అన్నారు.

February 19, 2025 / 04:29 PM IST

VIRAL: జగన్ ముద్దు పెట్టిన పాపపై ట్రోలింగ్

AP: వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఓ చిన్నారికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఆ పాప తనకు అమ్మఒడి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసి, స్కూలుకు వెళ్లటం లేదని చెప్పింది. కాగా.. ఆ పాప పేరు దేవికా రెడ్డి అని, ఆమె తండ్రికి బంగారం షాపు ఉందని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లో ఎక్కువ ఖర్చు పెట్టి చదువుతున్నట్లు నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.

February 19, 2025 / 02:27 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ: టాస్ గెలిచిన పాకిస్థాన్

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన్నాయి.

February 19, 2025 / 02:17 PM IST

‘ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’

JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.

February 19, 2025 / 02:07 PM IST

‘అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’

JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

February 19, 2025 / 01:59 PM IST

టాలెంట్ టెస్ట్ కరపత్రాల ఆవిష్కరణ

BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

February 19, 2025 / 01:54 PM IST

‘నాటుసారాతో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్’

ASR: నాటుసారాతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు బుధవారం అరకు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిపిన దాడులలో సుంకరమెట్ట పంచాయితీ కిన్నంగూడ జంక్షన్ వద్ద 62 లీటర్ల నాటుసారతో సుంకరమెట్టకు చెందిన బురిడి సోమయ్య, దుక్కగూడ గ్రామ వాసి పొట్టంగి సోమ, దండబాడుకు చెందిన చిట్టంనాయక్ లచ్చింధర్‌లు పట్టుబడినట్లు సీఐ పేర్కొన్నారు.

February 19, 2025 / 01:49 PM IST

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BHPL: తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన భూపాలపల్లి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్ ఉన్నారు.

February 19, 2025 / 01:47 PM IST

ప్రత్యేక తరగతులను పరిశీలించిన ఎంఈవో

VZM: తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిరసిస్తున్న ప్రత్యేక తరగతులను బుధవారం మండల విద్యాధికారి జె. త్రినాధరావు తనిఖీ చేశారు. మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 19, 2025 / 01:34 PM IST