NZB:ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నేర ఆంధ్రయ్య తెలిపారు. కమ్మర్ పల్లి మండలంలోని 4 కేంద్రాల్లో మొత్తం 478 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.