NDL: నిబంధనలకు విరుద్ధంగా, మద్యం తాగి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు. గురువారం రాత్రి గాజులపల్లె పరిధిలోని మెట్ట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందికి జరిమానాలు విధించారు. రోడ్డు నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.